📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Natanz Nuclear Site: న‌టాంజ్ అణుశుద్దిక‌ర‌ణ కేంద్రంపై ఇజ్రాయిల్ అటాక్

Author Icon By Sudha
Updated: June 13, 2025 • 2:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్‌లోని న‌టాంజ్ (Natanz)అణు శుద్దీక‌ర‌ణ కేంద్రంపై ఇజ్రాయిల్ (Israel) అటాక్ చేసింది. అయితే అక్క‌డ రేడియేష‌న్ లెవ‌ల్స్ పెర‌గ‌లేద‌ని అంతర్జాతీయ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ (Atomic Energy Agency)పేర్కొన్న‌ది.

Natanz Nuclear Site: న‌టాంజ్ అణుశుద్దిక‌ర‌ణ కేంద్రంపై ఇజ్రాయిల్ అటాక్

అణ్వాయుధాల‌ను త‌యారు చేస్తున్న ఇరాన్ ఆగ‌డాల‌ను ఆపాల‌న్న ఉద్దేశంతో ఇజ్రాయిల్ దాడుల‌కు పాల్ప‌డింది. అయితే ఇరాన్‌లో ఉన్న ప‌లు అణు కేంద్రాల‌పై దాడి చేశారు. దాంట్లో న‌టాంజ్ అణు శుద్దీక‌ర‌ణ కేంద్రం(Natanz Nuclear Site)పై కూడా ఇజ్రాయిల్ అటాక్ చేసింది. ఆ కేంద్రంపై ప‌లుమార్లు తీవ్రంగా దాడి చేసిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. న‌టాంజ్‌లో అణు శుద్దీక‌ర‌ణ జ‌రుగుతున్న‌ది. ఇక్క‌డ అండ‌ర్‌గ్రౌండ్‌లో న్యూక్లియ‌ర్ సైట్ ఉన్న‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇరాన్‌లోని ఫోర్డోలో కూడా మ‌రో అండ‌ర్‌గ్రౌండ్ న్యూక్లియ‌ర్ సైట్ ఉంది. న‌టాంజ్ కేంద్రం నుంచి భారీ స్థాయిలో న‌ల్ల‌టి పొగ వ‌స్తున్న విజువ‌ల్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఏ మేర‌కు డ్యామేజ్ జ‌రిగింద‌న్న దానిపై క్లారిటీ లేదు.
ప‌లువురు మృతి
ఇరాన్‌పై జ‌రిగిన దాడుల్లో ప‌లువురు మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. దేశ రాజ‌ధాని టెహ్రాన్ కేంద్రంగా కూడా బాంబుల వ‌ర్షం కురిసింది. కేవ‌లం ఇరాన్ అణ్వాయుధ ప్రోగ్రామ్ ల‌క్ష్యంగా ఇజ్రాయిల్ మిలిట‌రీ దాడుల‌కు దిగింది. ఇరాన్ వ‌ద్ద 15 అణు బాంబుల‌కు కావాల్సినంత శుద్ది చేసిన యురేనియం ఉన్న‌ట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తున్న‌ది. అయితే ప్ర‌పంచ దేశాల‌ను టార్గెట్ చేసే ఉద్దేశంతో ఇరాన్ త్వ‌రిత‌గ‌తిన అణ్వాయుధాల‌ను రూపొందిస్తున్న‌ద‌ని, బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను త‌యారు చేస్తున్న‌ద‌ని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. ఇలాంటి సంద‌ర్భంలో ఇరాన్‌పై దాడి చేయ‌డం త‌ప్ప మ‌రో అవ‌కాశం లేద‌ని ఇజ్రాయిల్ స్ప‌ష్టం చేస్తున్న‌ది. అణ్వాయు స‌మీక‌ర‌ణ‌పై దృష్టి పెట్టిన ఇరాన్‌.. సంపూర్ణ ద‌శ‌కు చేరువైన‌ట్లు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన‌ట్లు ఇజ్రాయిల్ చెప్పింది.
రేడియేష‌న్ లీక్
న‌జాంట్ అణు కేంద్రంపై దాడి త‌ర్వాత అక్క‌డ ఎటువంటి రేడియేష‌న్ లీక్ జ‌ర‌గ‌లేద‌ని అంత‌ర్జాతీయ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ పేర్కొన్న‌ది. రేడియేష‌న్ లెవల్స్ పెర‌గ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. దాడుల స‌మ‌యంలో బుషేహ‌ర్ న్యూక్లియ‌ర్ పవ‌ర్ ప్లాంట్‌ను టార్గెట్ చేయ‌లేద‌ని కూడా అంత‌ర్జాతీయ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీ తెలిపింది.

Read Also:Flight Crash: విమానంలో చివరి క్షణంలో ఏం జరిగింది?

Breaking News in Telugu Google news Google News in Telugu Israeli attack on Latest News in Telugu Natanz nuclear enrichment center Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.