Israel Iran War: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భయానక స్థాయికి చేరుకున్నాయి. తాజాగా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో విమానాశ్రయ ప్రాంగణం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు, సిబ్బంది గాయపడినట్లు సమాచారం. విమానాశ్రయ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు.
Read Also: Manchu Vishnu Dubai: దుబాయ్లో మంచు విష్ణు ఫ్యామిలీకి తప్పిన ముప్పు
దుబాయ్పై మిస్సైళ్ల వర్షం
మరోవైపు, పర్యాటక హబ్ అయిన దుబాయ్పై కూడా ఇరాన్ మిస్సైళ్లతో విరుచుకుపడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఆకాశంలో మిస్సైళ్లు దూసుకెళ్తున్న దృశ్యాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. ఈ దాడుల వల్ల దుబాయ్లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఇజ్రాయెల్ ప్రతిదాడి – పాఠశాల ధ్వంసం
ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ తన ప్రతీకార చర్యలను వేగవంతం చేసింది. ఇరాన్లోని మినాబ్ సిటీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఒక పాఠశాల పూర్తిగా ధ్వంసమైంది. జనావాసాల మధ్య దాడులు జరుగుతుండటంతో సామాన్య ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం అదుపు తప్పి ఇతర దేశాలకు వ్యాపించే ప్రమాదం కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: