పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతుండగా, అమెరికా మరియు నాటో (NATO) దళాలు రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. గత 11 రోజులుగా జరుగుతున్న దాడుల్లో సుమారు 1900 మందికి పైగా ఇరాన్ సైనికులు మరియు కమాండర్లు మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రకటించాయి. ఇరాన్లోని ప్రధాన నగరాలైన టెహ్రాన్, ఇస్ఫాహాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విమానాలు దాడులు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయుధాల సరఫరాకు వాడుతున్న 6 మిలిటరీ విమానాశ్రయాలను ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.
Read Also: IRGC: యుద్ధం ముగింపుపై ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
Iran-Israel-US War: Battlefield in West Asia: Fierce fighting on the 11th day
అమెరికా రీపర్ డ్రోన్ల ధ్వంసం
ఇరాన్ కూడా దీటుగా బదులిస్తోంది. అమెరికాకు చెందిన అత్యంత శక్తివంతమైన MQ-9 రీపర్ (Reaper) డ్రోన్లను తాము కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా విడుదల చేసింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ తన 33వ విడత క్షిపణి దాడులను కొనసాగిస్తోంది. యుద్ధం ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోంది. బహ్రెయిన్లోని సిత్రా ప్రాంతంలో ఇరాన్ డ్రోన్లతో దాడి చేయడంతో పౌరులు గాయపడ్డారు. మరోవైపు, ఇరాన్ ప్రయోగించిన ఒక బాలిస్టిక్ మిస్సైల్ తుర్కియే (Turkey) వైపు దూసుకురావడంతో, నాటో కూటమి దానిని గాలిలోనే కూల్చివేసింది. ఈ పరిణామంతో నాటో దేశాలు కూడా ఈ యుద్ధంలో భాగస్వామ్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరాక్లోని ఇర్బిల్లో ఉన్న యూఏఈ (UAE) కాన్సూలేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో ఆస్తి నష్టం జరిగినప్పటికీ, ప్రాణనష్టం తప్పిందని సమాచారం. గల్ఫ్ దేశాల్లోని రాయబార కార్యాలయాలే లక్ష్యంగా ఇరాన్ అనుకూల వర్గాలు దాడులు చేస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :