Latest News: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి

Read Time:  1 min
Latest News: Gaza: మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి
FONT SIZE
GET APP

పాలస్తీనాలోని గాజా (Gaza) స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు జరిపింది.భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం (ఐఏఎఫ్) గాజాను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేసింది. ఇందులో 22 మంది చనిపోయారని ప్రాణాలు కోల్పోయారని గాజా డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది.

Read Also: US Congress news : అమెరికా కాంగ్రెస్‌ ఎప్స్టీన్ ఫైళ్ల విడుదలకు ఆమోదం…

గాజా (Gaza) లో 12 మంది, ఖాన్‌ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు హమాస్ చెప్పింది. ఈ దాడులపై ఇజ్రాయెల్ కూడా మాట్లాడింది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే స్ట్రైక్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలటరీ చెబుతోంది.

ఇజ్రాయెల్ బాంబు దాడిలో కనీసం 77 మంది పాలస్తీనియన్లు గాయపడ్డారని గాజాలోని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెలలో అమల్లోకి వచ్చిన అమెరికా మధ్యవర్తిత్వంలోని కాల్పుల విరమణ అతిపెద్ద ఉల్లంఘన ఇదని అంటున్నారు.  

Israel attacks Gaza once again
Israel attacks Gaza once again

మూడు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు

ఇజ్రాయెల్… ఖాన్ యూనిస్ సమీపంలోని దక్షిణ గాజాలోని అల్-మవాసి ప్రాంతంతో సహా మూడు నిర్దిష్ట ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని చెబుతున్నారు.అయితే, ఈ దాడులపై ఇజ్రాయెల్ మిలిటరీ భిన్నమైన వాదన వినిపిస్తోంది.

తమ దేశంపై దాడి చేసేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారన్న సమాచారంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఈ స్ట్రైక్స్ జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో గాజా ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.