📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? ట్రంప్ వ్యాఖ్యలతో రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి?

Gaza: ఐదుగరు జర్నలిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం

Author Icon By Vanipushpa
Updated: August 11, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గాజా(Gaza)లో ఇజ్రాయెల్ సైన్యం(Isreal Army) ఆగడాలు రోజురోజుకూ ఎక్కువైపోతున్నాయి. ఆ నగరానికి విముక్తి కల్పిస్తామని నెతన్యాహు(Netanyahu) చెబుతున్నారు. అక్కడ హమాస్ ను సమూలంగా నాశనం చేయడమే తమ లక్ష్యమని అన్నారు. దానికి తగ్గట్టే ఐడీఎఫ్ గాజాలో దాడులు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన దాడుల్లో ఐదుగురు అల్ జజీరా జర్నలిస్టులను చంపేశారు. అల్ జజీరా కరస్పాండెంట్లు అనాస్ అల్-షరీఫ్, మొహమ్మద్ క్రీఖే, అలాగే కెమెరామెన్ ఇబ్రహీం జహెర్, మోమెన్ అలీవా, మొహమ్మద్ నౌఫాల్ లు ఉన్నారు. అల్ షిఫా హాస్పిటల్ మెయిన్ గేట్ దగ్గర ప్రెస్ కోసం వేసిన టెంట్ మీద ఇజ్రాయెల్ సైన్యం అటాక్ చేసింది. ఇందులో మొత్తం ఏడుగురు మరణించగా..అందులో ఐదుగురు జర్నలిస్టులు. ఈ దాడిని తామే చేశామని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే జర్నలిస్టులలో ఒకరు హమాస్ ఉగ్రవాదని సైన్యం తెలిపింది. హమాస్ ఉగ్రవాది ఒకరు జర్నలిస్ట్ గా వ్యవహరిస్తూ తప్పించేుకుని తిరుగుతున్నాడని అందుకే చంపామని తన దాడిని సమర్ధించుకుంది.

Gaza: ఐదుగరు జర్నలిస్టులను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం

జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడి ఇదే
దాడిలో చనిపోయిన అనాస్ అల్ షరీఫ్ అనే వ్యక్తి హమాస్ ఉగ్రవాదని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. హమాస్‌లోని ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని అంటోంది. ఇతని వయసు 28 ఏళ్ళు. కరెక్ట్ గా దాడికి ముందు షరీఫ్ తన ఎక్స్ లో గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడులను తీవ్రతరం చేసిందని పోస్ట్ చేశాడు. షరీఫ్ చనిపోయిన వెంటనే ఈ పోస్ట్ ఎక్స్ లో కనిపించింది. తన చావును అతను ముందుగానే ఊహించి రాసాడని…ఆ తర్వాత వేరే ఫ్రెండ్ ద్వారా పోస్ట్ చేయబడిందని చెబుతున్నారు. నా పోస్ట్ కనుక మీరు చూస్తే అప్పటికే నా గొంతు అణివేయబడిందని మీరు భావించండి అంటూ అల్ షరీఫ్ పోస్ట్ లో రాశారు. మరోవైపు గాజాలో 22 నెలల యుద్ధంలో జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని జరిగిన తాజా దాడి ఇదేనని, ఈ సంఘర్షణలో దాదాపు 200 మంది మీడియా ఉద్యోగులు మరణించారని మీడియా వాచ్‌డాగ్‌లు తెలిపాయి.

గాజా కథ ఏమిటి?
గాజాను వివిధ రాజవంశాలు, సామ్రాజ్యాలు మరియు ప్రజలు పాలించారు, నాశనం చేశారు మరియు తిరిగి జనాభా కల్పించారు. మొదట కనానైట్ స్థావరంగా ఉన్న ఇది, దాదాపు 350 సంవత్సరాల పాటు పురాతన ఈజిప్షియన్ల నియంత్రణలోకి వచ్చింది, తరువాత జయించబడి ఫిలిష్తీయుల ప్రధాన నగరాల్లో ఒకటిగా మారింది.
ఇజ్రాయెల్ గాజాపై ఎందుకు దాడి చేసింది?
ఇజ్రాయెల్ ప్రచారం నాలుగు లక్ష్యాలను కలిగి ఉంది: హమాస్‌ను నాశనం చేయడం, బందీలను విడిపించడం, గాజా ఇకపై ఇజ్రాయెల్‌కు ముప్పు కలిగించకుండా చూసుకోవడం మరియు ఉత్తర ఇజ్రాయెల్ నుండి స్థానభ్రంశం చెందిన నివాసితులను తిరిగి ఇవ్వడం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/donald-trump-us-and-russian-presidents-to-hold-key-meeting-on-15th-of-this-month/international/528382/

Gaza israel journalists Killings Latest News Breaking News middle east conflict Telugu News war crimes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.