మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇజ్రాయెల్ (Israel) ఈ తెల్లవారుజామున ఇరాన్పై (Against Iran) ఆకస్మికంగా వైమానిక దాడులకు దిగింది. టెహ్రాన్ నగరంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిగినట్టు సమాచారం.ఇజ్రాయెల్ సైనిక అధికారులు స్పందిస్తూ, “ఇది ఆత్మరక్షణ చర్య” అని పేర్కొన్నారు. డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇరాన్ ఇప్పటికే 15 అణు వార్హెడ్ల స్థాయికి సరిపడే యురేనియం నిల్వ చేశుందని ఆరోపిస్తున్నారు. అణ్వాయుధ తయారీ కోసం అవసరమైన దశకు చేరుకుందంటూ నిందలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్టు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇజ్రాయెల్లో అప్రమత్తత – అత్యవసర పరిస్థితి అమల్లో
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగవచ్చన్న ఆందోళనతో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో రక్షణ చర్యలు పెంచారు. పౌరులను అప్రమత్తం చేసే విధంగా సైరన్లు మోగించారు.
టెహ్రాన్లో పొగలు.. ప్రజలు భయాందోళనలో
టెహ్రాన్ నగరంలో ఒక్కసారిగా పేలుళ్లు, పొగలు ప్రజలను భయపెట్టాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగలు ఆవరించాయి. క్షిపణుల దాడుల ధ్వని సమీప నగరాలకు వినిపించిందని నివేదికలు చెబుతున్నాయి. దాడుల్లో ఏయే ప్రాంతాలు దెబ్బతిన్నాయో స్పష్టంగా తెలియదు. ప్రాణనష్టం వివరాలు ఇంకా వెల్లడికావలసి ఉంది.
అమెరికా స్పందన – మాకేమీ సంబంధం లేదు
ఈ దాడులపై అమెరికా తక్షణమే స్పందించింది. తమకు ఇందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో రెండు దేశాలను సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఇరాన్ అమెరికా సిబ్బందిని లక్ష్యంగా చేసుకోకూడదని హెచ్చరించారు. కొన్ని దౌత్య కార్యాలయాల నుంచి సిబ్బందిని వెంటనే తరలించడం ప్రారంభించినట్టు సమాచారం.
Read Also : Donald Trump : భారత్ కు ఎలాంటి సాయం చేసేందుకైనా సిద్ధం – ట్రంప్