News Telugu: Island: ఎరుపెక్కిన సముద్రం-వీడియో వైరల్

Read Time:  1 min
The sea turns red
The sea turns red
FONT SIZE
GET APP

ఇటీవల సోషల్ మీడియాలో ఓ సముద్రం తెగ వైరల్ అవుతున్నది. సముద్రం ఎరుపెక్కిపోయింది. బీచ్ సమీపంలో ఎరుపురంగు నీళ్ల కెరటాలు వస్తుంటే ప్రజలు భయపడుతున్నారు. ఇది ప్రకృతి విపత్తుగా భావిస్తున్నారు. అయితే ఇది ప్రకృతి విపత్తుగానీ, ప్రమాదకరమైన ఘటన గానీ కాదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఇరాన్ లోని హార్ముజ్ ద్వీపంలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఇరాన్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడి బీచ్ లు, సముద్ర తీరాలు ఎరుపు లేదా రక్తం రంగులోకి మారాయి. చూసేందుకు ఇదేదో వింతగా కనిపిస్తుంది. దీంతో ప్రజలు తమ భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే సముద్రం నీరు ఎరుపుగా మారడం సహజమైనదని, ఎలాంటి ప్రమాదం లేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Read also: US Tariff: యుద్ధాల విరమణపై ట్రంప్ మళ్లీ.. మళ్లీ.. అదేపాట

హెమటైట్ అనే కెమికల్ కాంపౌండ్

హార్ముజ్ ద్వీపంలోని నేల, పర్వతాలు ఐరన్ ఆక్సైడ్ తో, హెమటైట్ అనే ఖనిజంతో సమృద్ధిగా ఉంటాయి. నీరు ఎరుపుగా మారేందుకు ఇది ఒక కారణమని నిపుణులు అంటున్నారు. ఎరుపుకు కారణం కూడా ఇదే.. హెమటైట్ (Hematite) అనే కెమికల్ కాంపౌండ్ భూమిపై ఎరుపురంగును కలిగించే సహజ ఐరన్ ఆక్సైడ్. ఇది సాధారణంగా ఇనుము తప్పు పట్టినప్పుడు కనిపించే లక్షణంతో సమానంగా ఉంటుంది. ఇదే ఖనిజం అంగారక గ్రహం ఉపరితలంపై కనిపించే ఎరుపురంగుకు కూడా కారణం. భారీ వర్షాలు పడినప్పుడు, నీరు ఇనుము అధికంగా ఉన్న పర్వతాలు, నేల గుండా ప్రవహిస్తూ హెమటైట్ కణాలను కొట్టుకెళ్లి సముద్రతీరానికి తీసుకువస్తుంది. ఫలితంగా సముద్రపు నీరు, ఇసుక ఎరుపురంగులోకి మారతాయని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.