हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Telugu News: Islamabad: పాక్‌లో ఆందోళనలు.. రావల్పిండిలలో ఇంటర్నెట్ కట్

Sushmitha
Telugu News: Islamabad: పాక్‌లో ఆందోళనలు.. రావల్పిండిలలో ఇంటర్నెట్ కట్

పాకిస్థాన్‌లో(Pakistan) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్‌కు(Israel) వ్యతిరేకంగా తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే మతతత్వ పార్టీ తలపెట్టిన భారీ ర్యాలీ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం జరగనున్న ‘లబ్బైక్ యా అక్సా మిలియన్ మార్చ్’ కారణంగా రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవలను నిరవధికంగా నిలిపివేశారు.

Read also : PPP: వైద్య కళాశాలలకు ‘పిపిపి’లో తప్పేముంది?

భద్రతా చర్యలు, 144 సెక్షన్ అమలు

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా, రాజధానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను మూసివేసి దిగ్బంధించారు. నగరంలోని రెడ్ జోన్‌ను పూర్తిగా సీల్ చేసి, కేవలం అధికారిక పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మోహ్సిన్ నఖ్వీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు, పంజాబ్ ప్రావిన్స్ వ్యాప్తంగా 10 రోజుల పాటు 144 సెక్షన్‌ను అమలు చేశారు. దీని ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించారు.

Islamabad

లాహోర్‌లో ఘర్షణ, దాడులు

ఈ ర్యాలీకి ముందే లాహోర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీఎల్‌పీ చీఫ్ సాద్ హుస్సేన్ రిజ్వీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బుధవారం రాత్రి వారి ప్రధాన కార్యాలయంపై దాడి చేశారు. దీంతో టీఎల్‌పీ కార్యకర్తలు రాళ్లు, ఇనుప రాడ్లతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. ఈ ఘర్షణల్లో ఐదుగురు పోలీసులు, పదుల సంఖ్యలో ఆందోళనకారులు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, తమ కార్యకర్త ఒకరు మరణించగా, 20 మందికి గాయాలయ్యాయని టీఎల్‌పీ వర్గాలు ఆరోపించాయి.

టీఎల్‌పీ ఆరోపణలు, హెచ్చరికలు

ప్రభుత్వ చర్యలను టీఎల్‌పీ తీవ్రంగా ఖండించింది. “శాంతియుతంగా తలపెట్టిన మా ర్యాలీని అడ్డుకోవడానికి ప్రభుత్వం నీచమైన చర్యలకు పాల్పడుతోంది. పాలస్తీనాకు(Palestine) మద్దతు తెలపడం పాకిస్థాన్‌లో నేరంగా మారింది” అని టీఎల్‌పీ ప్రతినిధి ఆరోపించారు. నిర్బంధాలను ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుతం లాహోర్‌లోని టీఎల్‌పీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పరిస్థితి అదుపు తప్పితే పారామిలటరీ దళాలైన రేంజర్లను రంగంలోకి దించాలని పంజాబ్ ప్రభుత్వం యోచిస్తోంది.

పాకిస్థాన్‌లో ఏ పార్టీ ర్యాలీ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది?

తెహ్రీక్-ఏ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) పార్టీ ర్యాలీ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది.

ప్రభుత్వం ఏ నగరాల్లో మొబైల్ సేవలను నిలిపివేసింది?

రాజధాని ఇస్లామాబాద్, రావల్పిండి నగరాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని

నోబెల్ బహుమతి మా ప్రభుత్వ నిర్ణయం కాదు: నార్వే ప్రధాని

గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

భారత్ నిర్ణయానికి జై కొడుతున్న బ్రిక్స్ దేశాలు

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

అమెరికాపై EU ‘బజూకా’ ప్రయోగమా? వాణిజ్య యుద్ధం ముప్పు!

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

పోలాండ్ మంత్రికి గట్టి కౌంటర్ ఇచ్చిన జైశంకర్

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

రన్‌వేపై పడిపోయిన విమానం.. పైలట్‌ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

శాంతి బోర్డులో చేరాలంటే రూ. 9 వేల కోట్లు కట్టాల్సిందే

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

దక్షిణ స్పెయిన్‌లో రైలు ప్రమాదం.. 39 మంది మృత్యువాత

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

రష్యా నుంచి గ్రీన్‌లాండ్‌కు విముక్తి కల్పిస్తాం: ట్రంప్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

సీఎం చంద్రబాబును కలిసిన సింగపూర్‌ అధ్యక్షుడు

📢 For Advertisement Booking: 98481 12870