అమెరికా మీడియా రంగంలో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ మీడియా సంస్థ ‘వాషింగ్టన్ పోస్ట్’ తమ సిబ్బందిలో మూడింట ఒక వంతు మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు వెల్లడైంది. మొత్తం 300 మందికి పైగా ఉద్యోగులు ఈ లేఆఫ్స్కు గురైనట్లు సమాచారం. ఈ జాబితాలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనయుడు ఇషాన్ (Ishaan Tharoor) కూడా ఉన్నారు.. ఈ విషయాన్ని స్వయంగా ఇషాన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఇది మరింత చర్చనీయాంశమైంది.
Read Also: Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు
ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను పాఠకులకు వివరించడమే నా లక్ష్యం
‘నాతో పాటు చాలా మంది ఇంటర్నేషనల్ స్టాఫ్ను తొలగించారు. మా ఖాళీ న్యూస్ రూమ్ను, జర్నలిస్టులను చూస్తుంటే బాధగా ఉంది’ అని పేర్కొన్నారు. “2017లో ‘వరల్డ్వ్యూ’ కాలమ్ ప్రారంభించినప్పుడు అమెరికా, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను పాఠకులకు వివరించడమే నా లక్ష్యం. గత కొన్ని ఏళ్లుగా నా కాలమ్ను అనుసరిస్తున్న ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్లకు నేను రుణపడి ఉంటాను” అని ఇషాన్ (Ishaan Tharoor)పేర్కొన్నారు. AI వల్ల ITతో పాటు ఇతర రంగాల్లో లేఆఫ్స్ కొనసాగుతున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: