మధ్యప్రాచ్యంలో యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఇరాన్కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ పవర్ ఫుల్ ఆర్మీ వింగ్ ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్’ (IRGC) అధికార ప్రతినిధి నిన్న అమెరికాకు వార్నింగ్ ఇచ్చాడు. ఈ రోజు ఆయన (బ్రిగేడియర్ జనరల్ అలీ మహమ్మద్ నైనీ) (Ali Mohammed Naini) అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన జాయింట్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ శుక్రవారం అధికారికంగా ధృవీకరించింది.
Read Also: Water Bottle Price Hike: యుద్ధ సెగ.. మంచినీటి ధరలకు రెక్కలు: బాటిల్ వాటర్ ధరలు 11% పెంపు!

అమెరికా-ఇజ్రాయెల్కు అలీ మహమ్మద్ నైని చివరి హెచ్చరిక
మరణానికి ముందు తన చివరి ప్రకటనలో, ఇరాన్ ఇకపై యురేనియంను సుసంపన్నం చేయలేదని లేదా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయలేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన వాదనను ఆ బ్రిగేడియర్ జనరల్ బహిరంగంగా ఎగతాళి చేశారు. ఇజ్రాయెల్ మరియు అమెరికాతో యుద్ధం ఉన్నప్పటికీ టెహ్రాన్ క్షిపణి పరిశ్రమ ‘అత్యున్నత స్థాయికి’ చేరుకుందని ఆయన అన్నారు. యుద్ధ సమయంలో కూడా ఇరాన్ క్షిపణి ఉత్పత్తి కొనసాగుతుందని, ఎటువంటి ఆందోళన లేకుండా తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని నైని పేర్కొన్నారు. “మా క్షిపణి పరిశ్రమకు సంపూర్ణ మార్కులు రావాలి… ఈ విషయంలో ఆందోళన లేదు, ఎందుకంటే యుద్ధ పరిస్థితులలో కూడా మేము క్షిపణి ఉత్పత్తిని కొనసాగిస్తున్నాము,” అని ఆయన అన్నట్లు ఫార్స్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.
ఇరాన్ నాయకత్వానికి వరుస దెబ్బలు
ఫిబ్రవరి 28న అయాతుల్లా అలీ ఖమేనీ మరణించినప్పటి నుండి ఇరాన్ నాయకత్వం వరుసగా కీలక నేతలను కోల్పోతోంది. ఈ వారంలోనే సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ, బాసిజ్ కమాండర్ ఘోలామ్రెజా సులేమానీ, మరియు ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతీబ్ మరణించగా, ఇప్పుడు నైనీ మరణం ఇరాన్ ప్రచార యంత్రాంగానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :