Iran Oil Crisis Warning: మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ప్రపంచ దేశాలను గడగడలాడించే నిర్ణయంతో ఇరాన్ ముందుకు వచ్చింది. అస్థిరమైన ప్రాంతీయ భద్రతకు నిరసనగా ఆయిల్ సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలను ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ మిలిటరీ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
Read Also: Shortage hotels : గ్యాస్ కొరతతో హోటళ్లకు షాక్, ₹20 కోట్ల నష్టం
హార్మూజ్ పై ఇరాన్ పెత్తనం
ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో సుమారు 20 శాతం ఈ జలసంధి గుండానే ప్రయాణిస్తుంది. ఇప్పుడు ఈ మార్గాన్ని మూసివేయడమే కాకుండా, ఇకపై ఇక్కడ ప్రయాణించే నౌకలు తమ అనుమతి తీసుకోవాల్సిందేనని ఇరాన్ కఠిన నిబంధన విధించింది. ప్రాంతీయ భద్రతను అస్థిరపరిచే చర్యలకు పాల్పడుతున్న దేశాలకు ఇది ఒక హెచ్చరిక అని ఇరాన్ మిలిటరీ వర్గాలు స్పష్టం చేశాయి.
Iran Oil Crisis Warning: మండిపోనున్న ముడి చమురు ధరలు
ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకనున్నాయని ఇరాన్ అంచనా వేస్తోంది. సరఫరాలో అంతరాయం ఏర్పడితే త్వరలోనే ఆయిల్ ధరలు బ్యారెల్కు 200 డాలర్లకు చేరుకోవచ్చని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. ఇదే జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: ఇబ్రహీం జొల్పఖరీ
ఈ పరిణామాలపై ఇరాన్ మిలిటరీ స్పోక్స్ పర్సన్ ఇబ్రహీం జొల్పఖరీ మాట్లాడుతూ.. “ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే చర్యలు చేపట్టిన వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయిల్ సంక్షోభం కేవలం ప్రారంభం మాత్రమే” అని వ్యాఖ్యానించారు. ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఇతర పాశ్చాత్య దేశాల్లో కలకలం రేపుతోంది.
Hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :