నోబెల్ శాంతి పురస్కార గ్రహీత నర్గెస్ మొహమ్మదిని ఇరాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆమె అనుచరులు, ఒక స్వచ్ఛంద సంస్థ వెల్లడించాయి. అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన ఓ మానవ హక్కుల న్యాయవాది స్మారక స్థలం వద్ద ఆమెను అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై ఇరాన్ అధికార వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: Donald Trump: పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు?
మహిళా హక్కుల పోరాటకారిణిపై మరోసారి నిర్బంధం
మహిళా హక్కులు, స్వేచ్ఛల కోసం ఇరాన్( Iran) ప్రభుత్వానికి వ్యతిరేకంగా నర్గెస్ మొహమ్మది మూడు దశాబ్దాలకు పైగా ఉద్యమిస్తున్నారు. ఈ పోరాటంలో భాగంగా ఆమె ఎన్నోసార్లు జైలు శిక్షలు అనుభవించడంతో పాటు శారీరక శిక్షలను కూడా ఎదుర్కొన్నారు. ఆమె నిస్వార్థ సేవలకు గుర్తింపుగా 2023లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, ఆ సమయంలో ఆమె కారాగారంలోనే ఉన్నారు.
ప్రస్తుతం పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న నర్గెస్ మొహమ్మదికి(Narges Mohammadi) అనారోగ్య కారణాల నేపథ్యంలో 2024 డిసెంబర్లో కొద్ది వారాల పాటు పెరోల్ మంజూరైంది. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు, పాశ్చాత్య దేశాల ఒత్తిడి కారణంగా ఈ తాత్కాలిక విడుదల కొనసాగింది. ఇటీవల (Iran)ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల ఘర్షణ సమయంలో కూడా ఆమె స్వేచ్ఛలోనే ఉన్నారు. ఆ సమయంలో ఆమె నిరసన కార్యక్రమాలు, అంతర్జాతీయ మీడియా సమావేశాల్లో పాల్గొని తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :