📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Iran-Israel War: హార్ముజ్ జలసంధిలో ఓడలను ఇరాన్ మిసైళ్లతో పేల్చేయగలదా?

Author Icon By Vanipushpa
Updated: March 6, 2026 • 3:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ముడి చమురు ధరలు పెరిగాయి. బ్యారెల్ ముడి చమురు ధర 3.2 శాతం పెరిగి 80 డాలర్లకు చేరుకుంది. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ధరలు 30శాతం పెరిగాయి. గత వారాంతంలో హార్ముజ్(Hormuz) జలసంధి ద్వారా ప్రయాణిస్తున్న మూడు చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు ధరలు భగ్గుమన్నాయి. మిడిల్ ఈస్ట్‌లో కార్యకలాపాలు ఆగిపోవడంతో బ్రిటిష్ ఎయిర్‌వేస్ షేర్లు భారీ నష్టాలను చవి చూశాయి. తమ దేశానికి దక్షిణాన ఉన్న హార్ముజ్ జలసంధి ద్వారా నౌకల్ని పోనిచ్చేది లేదని ఇరాన్ హెచ్చరించింది. ఈ జల మార్గం ద్వారా ప్రపంచంలో 20 శాతం చమురు, సహజవాయువు రవాణా అవుతోంది.

Read Also: War Effect: శంషాబాద్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు 12 విమానాలు రద్దు

Iran-Israel War: Can Iran blow up ships in the Strait of Hormuz with missiles?

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, బంగారానికి గిరాకీ

హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గం వద్ద అంతర్జాతీయ నౌకలన్నీ నిలిచి పోయాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇటు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్లను ప్రభావితం చేసింది. అమెరికాలో స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. చమురు ధరలు పెరిగితే బ్యాంక్ వడ్డీ రేట్లపైనా ప్రభావం చూపుతుందనే ఆందోళన మార్కెట్లలో పెరిగింది. బ్రిటన్‌లోని ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 1.4 శాతం నష్టాలతో మొదలైంది. జర్మనీ స్టాక్ మార్కెట్ డాక్స్ ఇండెక్స్ కూడా 1.7 శాతం నష్టపోయింది. ఖతార్‌లోని రస్ లఫ్ఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఎల్‌ఎన్‌జీ కేంద్రాన్ని మూసివేయాలని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సౌదీ అరేబియాలోనని రస్ తనూరా వద్ద ఆరామ్‌కో సంస్థకు చెందిన చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ దాడి జరగడంతో ఈ రిఫైనరీని మూసివేశారు. హార్ముజ్ జలసంధి వద్ద అంతర్జాతీయ నౌకా రవాణా దాదాపుగా స్థంభించిపోయింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటే చమురు ధరలు పెరుగుతాయని విశ్లేషకులు హెచ్చరించారు. “హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితుల్ని మార్కెట్ గమనిస్తోంది. నౌకల రాకపోకలు మళ్లీ మొదలైతే ముడి చమురు ధరలు తగ్గుతాయి” అని ఇంధన పరిశోధన సంస్థ ఎంఎస్‌టీ మార్కీ అధిపతి సౌల్ కవోనిక్ చెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Global Oil Supply Threat Hormuz Chokepoint Security Iran Missile Capability Iran Navy Anti-Ship Missiles Israel Iran War 2026 Strait of Hormuz Tension Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.