Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజ కొణిదెల తన ఇద్దరు పిల్లలతో కలిసి ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. అక్కడ నెలకొన్న ఆందోళనకర పరిస్థితులపై ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాము క్షేమంగానే ఉన్నామని తెలిపి అభిమానుల ఆందోళనను దూరం చేశారు.
Read Also: Suriya 45 Update: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టైటిల్ అనౌన్స్మెంట్
విమానాశ్రయంలో పీవీ సింధు
మరోవైపు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఉద్రిక్తతల దృష్ట్యా విమాన సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆమెతో పాటు వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్పోర్ట్లో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోలేక అవస్థలు పడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: