Iran Attacks: దుబాయ్/వాషింగ్టన్ మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇజ్రాయెల్తో పాటు అమెరికా మిత్రదేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది.
Read Also: Iran Israel War: దుబాయ్లో చిక్కుకున్న సినీ ప్రముఖులు
ఎంబసీలు, సైనిక స్థావరాలే లక్ష్యం
తాజా దాడుల్లో భాగంగా కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం (Embassy) లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అలాగే, బహ్రెయిన్లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై కూడా క్షిపణి దాడులు జరగడంతో భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఖతార్ రాజధాని దోహాతో పాటు అబుదాబి నగరాల్లోనూ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ముడి చమురు కేంద్రాలపై డ్రోన్ల దాడి
ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంతో సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ల దాడితో రిఫైనరీ వద్ద భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు స్తంభించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: