భారతదేశ రక్షణ వ్యవస్థలో బ్రహ్మోస్(Brahmos) మిసైల్కు ప్రత్యేక స్థానం ఉంది. అత్యంత శక్తివంతమైన మిసైల్గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. ఇంత పేరు గడించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయడానికి ప్రపంచంలోనే అతి పెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా ఆసక్తి చూపుతోంది. ఇండియా నుంచి బ్రహ్మోస్ను కొనుగోలు చేయడానికి ఇండోనేషియా ఆసక్తి చూపుతుందని.. ఈ చారిత్రాత్మక ఒప్పందం చివరి దశలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి స్యాంసుదిన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం.. ఢిల్లీలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించింది.
Delhi Blast: డాక్టర్ షాహీన్ కు మూడు పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు
ఇరు దేశాల మధ్య బ్రహ్మోస్ కొనుగోలు ఒప్పందం
ఈక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇండోనేషియా రక్షణ మంత్రి సయాఫ్రి సియామ్సుద్దీన్కు బ్రహ్మోస్ క్షిపణి షిల్డ్ను బహుకరించారు. ఈ సందర్భంగా.. ఇండోనేషియా బృందానికి.. ఆపరేషన్ సింధూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణిని ఎలా వినియోగించారు అనే దానిపై ప్రత్యేక బ్రీఫింగ్ కూడా అందించారని సమాచారం. ఇరు దేశాల మధ్య బ్రహ్మోస్ కొనుగోలు ఒప్పందం దాదాపు ఖరారైందని.. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే మిగిలి ఉందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించిన ఇండోనేషియా బృందానికి.. అధికారులు.. బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల సామర్థ్యాల గురించి వివరించారు. ఈక్రమంలో ఇండోనేషియా.. భూమి, నావికా, వైమానిక దళాలకు ఉపయోగపడే బ్రహ్మోస్ వెర్షన్లను కోరుతోందని తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: