📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Smart Phones: భారీగా పెరిగిన భారత్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు

Author Icon By Sudha
Updated: May 20, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశం స్మార్ట్‌ఫోన్ (Smart Phones) తయారీ మరియు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ప్రస్తుతం, భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ ఉత్పత్తి దేశంగా నిలుస్తోంది, మరియు స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో కూడా రికార్డు స్థాయిలో వృద్ధిని నమోదు చేసింది.ముఖ్యంగా దేశంలో పీఎల్ఐ స్కీమ్ లాంచ్ చేశాక తయారీ రంగం వేగంగా వృద్ధి సాధిస్తుంది. దీంతో ఎగుమతులు (exports)కూడా భారీగా పెరిగాయి. స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు దేశంలో ఆకర్షణీయ వృద్ధిని సాధించాయి.

Smart Phones: భారీగా పెరిగిన భారత్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతులు

2024–25 ఆర్థిక సంవత్సరంలో, భారత్ స్మార్ట్‌ఫోన్‌లను రూ. 2 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేసింది, ఇది గత ఏడాది కంటే 54% అధికం. ఈ ఎగుమతుల్లో దాదాపు రూ. 1.5 లక్షల కోట్ల విలువైన ఐఫోన్‌లు ఉన్నాయి, ఇవి ప్రధానంగా తమిళనాడులోని ఫాక్స్‌కాన్ సౌకర్యం ద్వారా తయారు చేయబడుతున్నాయి
భారతదేశంలో మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీలో 99% పరికరాలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నారు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,90,366 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 9,52,000 కోట్లకు పెరిగింది . భారతదేశం 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 13% వాటాతో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది, చైనా 32% వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో యాపిల్ మరియు శాంసంగ్ కంపెనీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి
ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన మొదటి ఐదు దేశాలు అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్‌గా ఉన్నాయి. అమెరికాకు భారతదేశం ఎగుమతులు 2022-23లో 2.16 బిలియన్ల డాలర్ల నుంచి 2023-24లో 5.57 బిలియన్ల డాలర్లకు, 2024-25లో 10.6 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.
ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల స్మార్ట్‌ఫోన్లు భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ఒకటిగా మారిందని. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి ఎగుమతులను అధిగమించడానికి దోహదపడిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.
ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ పథకాల వల్ల వృద్ధి వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ సర్వీస్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్, సామ్‌సంగ్ దాదాపు 94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సంవత్సరానికి 6 శాతం పెరిగాయి. 2025లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ వృద్ధి అంచనా 2025లో రెండంకెలలో పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Read Also : Gold: దుబాయ్ బంగారంపై భారత్ కఠిన చర్యలు

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu increase sharply India's Latest News in Telugu Paper Telugu News smartphone exports Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.