📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ ప్రతిస్పందన..

Author Icon By Shobha Rani
Updated: May 26, 2025 • 1:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం అత్యంత సున్నితంగా మరియు ప్రణాళికబద్ధంగా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత దళాలు దాడులు చేసింది. భారత్‌ దాడుల్లో సుమారు 100 మందిదాకా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఈ దాడి తర్వాత పాక్‌ మళ్లీ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ క్రమంలో వాటిని తిప్పిటి కొట్టిన భారత్.. పాక్‌ పదే పదే ఇలాంటి దాడులు చేయకుండా నివారించేందుకు పాకిస్తాన్‌లోని ప్రధాన వైమానిక స్థావరాలపై దాడులు చేసింది.

Operation Sindoor: పాకిస్థాన్‌పై భారత్ ప్రతిస్పందన..

9 ఉగ్ర స్థావరాలపై దాడులు
భారత వైమానిక దళాలు చేసిన దాడిలో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్, రిఫికి, ముదిర్‌, చునియన్‌తో పాటు సుక్కూర్‌లోని పాకిస్థాన్ వైమానిక స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు పాకిస్తాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా భారత్‌ సరిహద్దుకు దగ్గరగా ఉండే మురిద్ వైమానిక స్థావరానికి భారీ మొత్తంలో నస్టం వాటిళ్లినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఎయిర్‌ బేస్‌లోనే పాకిస్తాన్‌కు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్‌లు, డ్రోన్‌లు ఉన్నట్టు సమాచారం. ఈ ముదిర్‌ వైమానిక స్థావరంలో పాక్‌కు చెందిన షాపర్ 1, షాపర్ 2, బుర్రాక్, ఫాల్కో, బేరక్‌తార్ టీబీ2ఎస్, బేరక్‌తార్ అకింజీ, సీహెచ్-4, వింగ్ లూంగ్ 2 వంటి అత్యాధునిక డ్రోన్‌లు, ఆయుధాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా భారత్‌ చేసిన దాడిలో ఇందులో చాలా మేర ధ్వంసంమైనట్టు తాజాగా విడుదలైన శాటిలైట్ చిత్రాల ద్వారా స్పష్టమవుతుంది.
మురిద్ ఎయిర్‌బేస్‌ – కేంద్రంగా ధ్వంసం
అయితే, ఆపరేషన్ సిందూర్‌(Operation Sindoor) లో భాగంగా పాకిస్తాన్‌లోని మురిద్ వైమానిక స్థావరంపై భారత్‌ చేసిన దాడిలో పాక్‌ వైమానిక దళ స్థావరానికి భారీ మొత్తంలో నష్టం జరిగినట్టు తాజాగా శాటిలైట్ చిత్రాలు విడుదలయ్యాయి. ఉపగ్రహం ద్వారా మే 23న తీయబడి ఈ చిత్రాలను ‘ది ఇంటెల్ ల్యాబ్’కు చెందిన జియో-ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ బయటపెట్టాడు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) భారతదేశం ఉగ్రవాదంపై తీసుకున్న కఠిన నిర్ణయం, పాక్‌కు ఇచ్చిన గట్టి హెచ్చరికగా నిలిచింది. మురిద్ ఎయిర్‌బేస్‌పై దాడి ద్వారా భారత్ పాకిస్థాన్ వైమానిక శక్తికి గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది. శాటిలైట్ ఆధారాలు దీనికి స్పష్టమైన నిదర్శనాలు.ఈ శాటిలైట్ చిత్రాల ప్రకారం.. భారత వైమానిక దళాలు జరిపిన దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని ఒక కీలకమైన కమాండ్ కంట్రోల్ భవనం ధ్వంసమైనట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అని డామియన్ సైమన్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

Read Also: Narendra Modi: ప్రధాని మోడీ గుజరాత్ పర్యటన షురూ

#telugu News Breaking News in Telugu Google news Google News in Telugu India's response Latest News in Telugu Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today to Pakistan Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.