అమెరికా(America)లోని శాన్ జోస్లో ఈ నెల మొదట్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువతి ఆర్తి సింగ్ ఇప్పటికీ కోమాలోనే ఉంది. సొంతవాళ్లు ఎవరూ లేక, వైద్య, చట్టపరమైన సవాళ్లతో ఒంటరిగా పోరాడుతున్న ఆర్తి తండ్రి సుమిరన్ సింగ్కు స్థానిక భారతీయ కమ్యూనిటీ మద్దతుగా నిలిచింది. నవంబర్ 9వ తేదీన ఆర్తి సింగ్ వృత్తిపరమైన నెట్వర్కింగ్ ఈవెంట్ నుంచి తిరిగి వస్తుండగా.. తన ఇంటి సమీపంలో రోడ్డు దాటుతుండగా ఓ వాహనం ఢీకొట్టింది. అప్పటి నుంచి ఆర్తి అపస్మారక స్థితిలోనే ఉంది. ఆమె శాంటా క్లారా వ్యాలీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె శ్వాస, ఆహారం కోసం వైద్యులు మెడ, కడుపు భాగాల్లో ముఖ్యమైన శస్త్రచికిత్సలు నిర్వహించారు.
Read Also: AP: మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

ఆమె కళ్లు తెరవాలనే ఆశ ఒక్కటే నాకుంది
కూతురి పక్కనే కూర్చుని ఉన్న సుమిరన్ సింగ్.. “నా కూతురు ఇంకా కళ్లు తెరవడం లేదు. నేను ప్రతిరోజూ ఆమెతో మాట్లాడుతున్నాను. ఆమె వింటుందని ఆశిస్తున్నాను. నాకు ఇక్కడ ఎవరూ లేరు. ఆమె మాత్రమే ఉంది. ఆమె కళ్లు తెరవాలనే ఆశ ఒక్కటే నాకుంది” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సంఘటన ‘హిట్ అండ్ రన్’ కాదని శాన్ జోస్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. అయితే డ్రైవర్ గుర్తింపును మాత్రం వెల్లడించలేదు. డ్రైవర్ 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అని, ప్రమాదం జరిగినప్పుడు అతడికి బీమా లేదని మాత్రమే తనకు సమాచారం అందిందని సింగ్ తెలిపారు. పోలీసులు అతడి పరిస్థితి లేదా అతనిపై నమోదయ్యే అభియోగాల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో కుటుంబం నిరాశ చెందుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: