మహారాష్ట్ర లోని సతారా జిల్లా కు చెందిన నీలమ్ షిండే ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి అక్కడ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.కాలిఫోర్నియాలో నీలమ్ ప్రయాణిస్తున్న కారును మరో కారు వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నీలం కాళ్లు, చేతులు విరిగిపోయాయని, తలకు తీవ్ర గాయం కావడంతో ఆమె కోమాలోకి వెళ్లిందని వైద్యులు తెలిపారు.ఈ ప్రమాదం ఫిబ్రవరి 14న జరిగిందప్పటికీ, నీలం తల్లిదండ్రులకు ఈ విషయాన్ని ఫిబ్రవరి 16న తెలియజేశారు. ఆమె తండ్రి తనాజీ షిండే మాట్లాడుతూ, తమ కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్లాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నామని, కానీ ఇప్పటి వరకు వీసా మంజూరు కాలేదని, ఈ ఆలస్యం తమకు తీవ్ర మనోవేదన కలిగిస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిలో వారు పార్లమెంటు సభ్యురాలు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ-ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలేను సహాయం కోరారు. సుప్రియా సూలే ఈ విషయాన్ని తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దృష్టికి తీసుకెళ్లారు. “నీలమ్ శిందే యూఎస్ఏలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె తండ్రి అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉంది. వెంటనే వీసా మంజూరు చేయాలని భారత విదేశాంగ శాఖను, భారత దౌత్య కార్యాలయాన్ని కోరుతున్నాను” అని ఆమె పోస్ట్ చేశారు.

ప్రభుత్వ స్పందన
వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, నీలమ్ తండ్రికి అత్యవసర ప్రయాణ అనుమతి కల్పించేందుకు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత విదేశాంగ శాఖలోని అమెరికా విభాగం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
నీలమ్ షిండే నాలుగేళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది.కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీజీ చేస్తోన్న నీలమ్ శిందే ఈ ఏడాది ఆమె చదువు పూర్తి కావాల్సి ఉంది.కేంద్ర ప్రభుత్వం స్పందించి, నీలమ్ తండ్రికి అత్యవసర ప్రయాణ అనుమతి కల్పించేందుకు అమెరికా అధికారులతో చర్చలు జరుపుతోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. భారత విదేశాంగ శాఖలోని అమెరికా విభాగం ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.కుటుంబ సభ్యుల ఆవేదనపై స్పందించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. వీసా అనుమతి త్వరలోనే మంజూరు అయ్యే అవకాశం ఉందని.