న్యూజిలాండ్(newzeland) లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తికి ఏడేళ్ల జైలుశిక్ష పడింది. మైనర్(minor-girl)పై అత్యాచారానికి(rape-case) పాల్పడిన కేసులో అతడికి ఈ శిక్ష పడింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సత్వీందర్ సింగ్ అనే వ్యక్తి గత 11 ఏళ్ల నుంచి న్యూజిలాండ్లో ఉంటున్నాడు. అతడు క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే 2023లో ఓ మైనర్ ప్రయాణికురాలు రాత్రిపూట అతడి క్యాబ్ను బుక్ చేసుకుంది.
Read Also: Pakistan TerrorGroups: భారత్పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

సత్వీందర్ సింగ్ను దోషిగా తేల్చిన కోర్టు
సత్వీందర్ సింగ్ ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. దారిలో వెళ్తుండగా జీపీఎస్ను ఆఫ్ చేశాడు. కారు రూట్ మార్చి వేరే చోటుకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన తర్వాత బాధితురాలిని ఆమె స్నేహితుల ఇంటి దగ్గర వదిలేశాడు. బాధితురాలి సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలతో పరిశీలించారు. అనంతరం సత్వీందర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఈ కేసుపై అక్కడి కోర్టు విచారణ జరిపింది. సత్వీందర్ సింగ్ను దోషిగా తేల్చి ఏడేళ్లు జైలు శిక్ష విధించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: