📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Army: పాక్ క్షిపణులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ..వీడియో విడుదల

Author Icon By Sharanya
Updated: May 19, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద చోటుచేసుకున్న ఉగ్ర దాడి దేశాన్ని విషాదంలో ముంచింది. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటనకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం “ఆపరేషన్ సిందూర్” అనే పేరుతో ప్రత్యేక దాడులకు శ్రీకారం చుట్టింది.

ఈ ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు పీఓకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్)తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం అంచనా వేసిన సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో పాక్ సైనికుల సహకారంతో పని చేస్తున్న పలువురు ఉగ్ర ముఠాల నేతలు కూడా మృతి చెందారు.

పాక్ మిస్సైల్ ప్రతీకారం

ఈ దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ అనేక డ్రోన్లు, క్షిపణులను భారత సరిహద్దు ప్రాంతాలపై ప్రయోగించగా, భారత గగనతల రక్షణ వ్యవస్థలు పటిష్టంగా స్పందించాయి. ఆకాశ్‌, ఎస్ 400 వంటి మ‌న గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు స‌మ‌ర్థ‌వంతంగా వాటిని తిప్పికొట్టాయి. వాటిని ఎక్క‌డిక‌క్క‌డ నేల‌మ‌ట్టం చేశాయి. ఈ క్ర‌మంలో పాక్ మిస్సైల్స్‌, డ్రోన్ల‌కు సంబంధించిన శ‌కలాలు చెల్లాచెదురుగా ప‌డ్డ వీడియోలు భారీ ఎత్తున సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేశాయి.

భారత ఆర్మీ విడుదల చేసిన వీడియో.. నెటిజన్ల స్పందన

పాకిస్థాన్‌పై జ‌రిపిన ప‌లు దాడుల వీడియోల‌ను భార‌త ఆర్మీ విడుద‌ల చేసిన విష‌యం విదిత‌మే. తాజాగా పాక్ క్షిప‌ణుల‌ను ఎలా కూల్చారో తెలిసేలా వెస్ట్ర‌న్ క‌మాండ్ ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అగ్ని గోడ‌లా భార‌త ఆర్మీ శత్రుదేశ‌పు మిస్సైల్స్‌ను నేల‌మ‌ట్టం చేసిందని పేర్కొంది. ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.

Read also: Indian Army : 100 మందికి పైగా ఉగ్ర‌వాదులు హ‌తం

#ArmyAction #indianarmy #IndiaStrikesBack #PakistanMissiles #SurgicalStrike #Videoviral Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.