📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Indian Army: ఉగ్రవాద కీలక స్థావరాలను ధ్వంసం చేసిన భారత ఆర్మీ

Author Icon By Sharanya
Updated: May 10, 2025 • 2:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో “ఆపరేషన్ సింధూర్” సైనిక స్థాయిలో ఒక కీలక ఘట్టంగా మారింది. మొదటి దశలో పాకిస్థాన్‌తో పాటు పీఓకే (పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్) లోని అనేక ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం నేలమట్టం చేసింది. ఈ దాడుల్లో వంద మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఇది ఉగ్రవాద ముప్పును ముందుగానే అణచివేసేందుకు భారత రక్షణ వ్యవస్థ తీసుకున్న ఘట్టమైన చర్యగా విశ్లేషించబడుతోంది.

డ్రోన్ల ద్వారా పాక్ దాడులు:

భారత్ సైన్యం వారి కుట్రలను సమర్ధంగా తిప్పి కొడుతోంది. ఈ సమయంలోనే జమ్ములో పాకిస్తాన్ డ్రోన్ల ను భారత్ పై ప్రయోగానికి స్థావరంగా వినియోగించు కుంటున్న టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. భారత్- పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. పాకిస్థాన్‌ సరిహద్దుల్లో కాల్పులే కాకుం డా డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనిపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మరోవైపు శ్రీనగర్, పఠాన్‌కోట్‌ ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పాక్​దాడులకు ప్రతీగా ఆ దేశానికి చెందిన మూడు వైమానిక స్థావరాలపై భారత్​ విరుచుకుపడనట్లు సమచారాం.

అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సహా ఐదుగురు మృతి

పాక్​జరిపిన దాడు ల్లో జమ్ముకశ్మీర్​కు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ రాజ్‌కుమార్‌ థప్పా మృతి చెందారు. రాజౌరి పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటం వల్ల ఆయన ప్రాణాలు కోల్పోయారు. రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనలో రాజ్​కుమార్ సహా ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. అటు శ్రీనగర్ లో ఉదయం నుంచి భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి.

లాంచ్ ప్యాడ్ల ధ్వంసం

జమ్ము ప్రాంతంలో డ్రోన్లతో దాడి చేసేందుకు స్థావరంగా వినియోగించుకుంటున్న లాంచ్ ప్యాడ్ లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. వీటి వీడియోలను విడుదల చేసింది. కాగా, పాకిస్థాన్‌లోని 4 ఎయిర్‌బేస్‌లపై మనం డ్రోన్‌ దాడులు చేసినట్లు భారత్ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఏడీ రాడార్‌ను డ్రోన్లు ధ్వంసం చేశాయని భారత సైన్యం ప్రతినిధి ఖురేషీ వెల్లడించారు. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించినట్లు చెప్పారు. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తోందని మండిపడ్డారు. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తు న్న ప్రచారం అవాస్తవం ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో భారత సైన్యాధికారులు తిప్పి కొట్టారు. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌ లాంచర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.

Read also: Jawan Sachin Yadav : సరిహద్దులో మరో వీరమరణం

#ArmyAction #bordersecurity #IndiaFightsTerror #indianarmy #IndianArmyPower #IndianDefence #TerrorismFreeIndia Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Operation Sindoor Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.