📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: UK-India: భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: October 9, 2025 • 1:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) ప్రస్తుతం భారత్‌(India)లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. అయితే కీర్ స్టార్మర్ (Keir Starmer) ముంబైలోని వైఆర్‌ఎఫ్‌ స్టూడియోను సందర్శించారు. ఈ సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో సహా భారతీయ నిర్మాణ సంస్థలు యూకేలోని అన్ని ప్రదేశాలలో సినిమాల్ని చిత్రీకరిస్తాయని వెల్లడించారు. భారత్‌కు స్టార్మర్ రాక వల్ల సినీ ఇండస్ట్రీకి మంచి రోజులు రానున్నాయి.

Netanyahu: బందీల విడుదలపై భావోద్వేగానికి గురైన

UK-India: భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం

సినీ రంగానికి అభివృద్ధి

కీర్‌ స్టార్మర్‌ పర్యటన సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాల నిర్మాణం ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల కొద్దీ పౌండ్ల పెట్టుబడి లభిస్తుంది. అలాగే యూకేలో 3,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు పెరుగుతాయి. దీంతో సినీ రంగానికి అభివృద్ధి జరుగుతుంది.

వాణిజ్య విషయాల్లో లాభాలు

ఈ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరుగుతుంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా బ్రిటన్ నుంచి దిగుమతి అయ్యే విస్కీ, కార్లు, వైద్య పరికరాలు వంటి ఉత్పత్తులపై భారతదేశం విధించే పన్నులు తగ్గుతాయి. దీని వలన బ్రిటిష్ కంపెనీలకు భారత మార్కెట్ మరింత అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న సుమారు రూ.4.5 లక్షల కోట్ల (44.1 బిలియన్ యూరోలు) వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేయాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే 2028 నాటికి భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ ఒప్పందం ఒక ‘లాంచ్‌ప్యాడ్’గా ఉపయోగపడుతుంది.

భారతదేశంలో కొత్త పెట్టుబడులు

స్టార్మర్ తన వెంట 125 మందికి పైగా ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో కూడిన భారీ బృందాన్ని తీసుకువచ్చారు. వీరు భారతదేశంలో కొత్త పెట్టుబడులు పెట్టే మార్గాలను చూస్తారు. పెట్టుబడులు ఎక్కువగా రావడంతో పాటు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. ఈ పర్యటన వల్ల వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, సాంకేతికత, వాతావరణ మార్పులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలు కూడా అభివృద్ధి చెందుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bilateral Trade Economic Partnership India UK agreement India UK collaboration India UK Trade Deal international trade relations Telugu News Trade Negotiations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.