📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation sindoor: భారత్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్‌ 22న ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మొపుతూ భారత్‌ మే 6,7 తేదీల మధ్య రాత్రి పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మొత్తం 9 స్థావరాలపై వైమానికి దాడులు చేసి 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ దాడులతో పాకిస్థానే కాదు భారత శక్తిని చూసి యావత్‌ ప్రపంచమే ఉలిక్కిపడింది. అయితే ఉగ్రవాదులపై చేసిన ఈ దాడులకు భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ (Operation sindoor) అని పేరు పెట్టింది. నిపుణుల అంచనా ప్రకారం – ₹50,000 కోట్లకు చేరే అవకాశం. 2047 నాటికి ప్రపంచంలో అత్యున్నత రక్షణ ఎగుమతిదారుగా భారత్‌ను తీర్చిదిద్దే లక్ష్యం ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు వంతపాడుతూ భారత్‌పై సైనిక దాడులకు ప్రయత్నించినా.. వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్య
ఆ విషయం పక్కనపెడితే.. ఆపరేషన్‌ సిందూర్‌(Operation sindoor)తో ఏం సాధించాం అని ఆలోచిస్తే.. ప్రపంచ మానవాళికి ముప్పుగా మారుతున్న 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టిలో కలిపేశాం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఉగ్రవాదంపై భారత్‌ సాధించిన విజయంగా అభివర్ణించవచ్చు. అదే ఆపరేషన్‌ సిందూర్‌ (Operation sindoor) ప్రధాన లక్ష్యం కూడా. అయితే.. కేవలం ఉగ్రవాదులపై విజయమే కాదు.. మంచి చేస్తే మరింత మంచి జరుగుతుంది అన్నట్లు ఇండియాకు వేల కోట్ల లాభం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపరేషన్‌ సిందూర్‌(Operation sindoor)తో మన ఎయిర్‌ ఫోర్స్‌ సాధారణ పౌరులకు ఏమాత్రం నష్టం కలగకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని.. గురి తప్పుకుండా క్షిపణులు ప్రయోగించింది. అంటే టార్గెట్‌ మిస్‌ కాకుండా కచ్చితత్వంతో దాడులు చేసింది.

Operation sindoor: భారత్‌కు ఆపరేషన్‌ సిందూర్‌తో వేల కోట్ల లాభం! ఎలాగంటే..?

శత్రు ఆయుధాలపై విజయవంతమైన ఎదురుదాడులు
భారత భూభాగంలో కూలిన డ్రోన్లు, క్షిపణుల ముక్కలను పరిశీలిస్తే.. PL-15 క్షిపణుల ముక్కలు “యిహా” లేదా “యెహా” అని పిలువబడే టర్కిష్-మూలం UAVలు, దీర్ఘ-శ్రేణి రాకెట్లు, క్వాడ్‌కాప్టర్లు, వాణిజ్య డ్రోన్‌ స్వాధీనం చేసుకుని గుర్తించారు. అవి టర్కీ, చైనా తయారు చేసినవిగా తేలింది. అంటే.. ఆ దేశాల రక్షణా వస్తువులను, ఆయుధాలను భారత్‌ నాశనం చేసి.. వాటి కంటే శక్తివంతమైన ఆయుధ సామాగ్రి, డిఫెన్స్‌ వ్యవస్థ మన వద్ద ఉందని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే వాటిలో కొన్ని మనం ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్నవి ఉన్నా.. మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న ఆకాశ్‌ వంటి డిఫెన్స్‌ వ్యవస్థ, తేజస్‌ వంటి యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి.
గ్లోబల్ డిఫెన్స్ ఎగుమతుల్లో కీలకంగా భారత్
భారత్‌ సొంతంగా తయారు చేసుకున్న యుద్ధ సామాగ్రి బలమేంటో తెలిసిన ప్రపంచ దేశాలు మన నుంచి వీటిని కొనుగోలు చేసే అవకాశం పెరిగింది. గతేడాది రూ.23 వేల కోట్ల విలువైన డిఫెన్స్‌ ఎగుమతులు చేసిన భారత్‌, ఆపరేషన్‌ సిందూర్‌ కారణంగా అవి రూ.50 వేల కోట్లుకు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు దాదాపు రూ.24,000 కోట్ల రికార్డును దాటాయి. 2029 నాటికి ఈ సంఖ్యను రూ.50,000 కోట్లకు పెంచడం, 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ ఎగుమతిదారుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. తేజస్, ఆకాశ్, బ్రహ్మోస్ వంటి ఆయుధాలపై అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. చైనా, తుర్కీ, పాకిస్థాన్ వంటి దేశాలతో టెక్నాలజీ పరంగా పోలిస్తే భారత్ ఆధిక్యం, ప్రతీకార దాడులు కంటే పెద్ద విజయం – రక్షణ రంగంలో ఆర్థిక లాభం.

రక్షణ తయారీ రంగంలో భారత ఆధిపత్యం
మేక్ ఇన్ ఇండియా చొరవ, ఆత్మనిర్భర్‌ భారత్‌ బలమైన ప్రోత్సాహం ద్వారా ఇండియా ఒక ప్రధాన రక్షణ తయారీ కేంద్రంగా అవతరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తి రికార్డు స్థాయిలో రూ.1.27 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు రూ.23,622 కోట్లకు పెరిగాయి. ఇది 2013–14 నుండి 34 రెట్లు ఎక్కువ. వ్యూహాత్మక సంస్కరణలు, ప్రైవేట్ రంగ ప్రమేయం, బలమైన పరిశోధన, అభివృద్ధి అధునాతన సైనిక వేదికల అభివృద్ధికి దారితీశాయి. 23–24లో స్వదేశీ ఉత్పత్తి విలువ ₹1.27 లక్షల కోట్లు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు, R&D బలపరిచిన ప్రభుత్వ చర్యలు. ప్రపంచ మార్కెట్లో భారత్ తయారుచేసిన ఆయుధాలపై డిమాండ్ పేరుగుతుంది.

Read Also: India-China: మిత్రదేశాల మధ్య చిచ్చు పెట్టే వ్యూహం: రష్యా మంత్రి

Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu Operation Sindoor! Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today thousands of crores with Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.