ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారత ప్రతినిధిగా బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari) దేశ తరఫున ప్రసంగించారు. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) వార్షిక నివేదికపై జరిగిన చర్చలో ఆమె జాతీయ ప్రకటన చేస్తూ, భారత్ అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడంలో పూర్తి కట్టుబాటు కలిగిన దేశమని స్పష్టం చేశారు.
Read Also: Tamil Nadu: జాబ్ స్కామ్.. రంగంలోకి ఈడీ!
అణు విజ్ఞానం, సాంకేతికతను శాంతియుత ప్రయోజనాల కోసం సురక్షితంగా, భద్రంగా వినియోగించడంలో IAEA పోషిస్తున్న కీలక పాత్రకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.
అణుశక్తి వల్ల బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయని పురందేశ్వరి (Purandeswari) అభిప్రాయపడ్డారు. కేవలం విద్యుత్ రంగంలోనే కాకుండా సుస్థిర అభివృద్ధి, ప్రజారోగ్యం, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాతావరణ మార్పుల నియంత్రణ వంటి అనేక రంగాల్లో అణు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

‘CAR-T సెల్ థెరపీ’ ద్వారా
ఈ దిశగా భారతదేశం సాధించిన ప్రగతి అసాధారణమైనదని ఆమె పేర్కొన్నారు.ముఖ్యంగా, ప్రజారోగ్య రంగంలో సాధించిన విజయాన్ని పురందేశ్వరి ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన ‘CAR-T సెల్ థెరపీ’ ద్వారా తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడం గర్వకారణమని తెలిపారు.
ఇది అణు పరిజ్ఞానం మానవాళికి ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పడానికి ఒక నిదర్శనమని అన్నారు.సామర్థ్య పెంపుదల, సాంకేతిక సహకారం వంటి కార్యక్రమాల ద్వారా భాగస్వామ్య దేశాలతో అణు పరిజ్ఞానాన్ని పంచుకుంటూ IAEAకు భారత్ నిరంతరం తోడ్పాటునందిస్తోందని పురందేశ్వరి వెల్లడించారు. శాంతియుత అణుశక్తి వినియోగంలో ప్రపంచ దేశాలకు అండగా నిలుస్తామని ఆమె పునరుద్ఘాటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: