River india stops : పాకిస్థాన్కు దశాబ్దాలుగా వెళ్తున్న రావి నది మిగులు జలాలను నిలిపివేయడానికి భారత్ కీలక చర్యలు చేపట్టింది. పంజాబ్–జమ్మూ కశ్మీర్ సరిహద్దులో నిర్మిస్తున్న షాపుర్కండి బ్యారేజీ పనులు తుది దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మార్చి 31 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వస్తే రావి నది నీటిని నిల్వ చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవచ్చు.
Read Also: Maharashtra: అజిత్ పవార్ విమాన ప్రమాదం.. సీబీఐ విచారణకు సునేత్ర డిమాండ్
ఈ బ్యారేజీ ద్వారా జమ్మూ కశ్మీర్లోని కతువా, సాంబా జిల్లాల కరవు ప్రభావిత ప్రాంతాల్లో 32 వేల హెక్టార్లకు పైగా సాగునీరు అందించనున్నారు. పంజాబ్లో కూడా వేల ఎకరాలకు నీటి ప్రయోజనం కలుగనుంది. అదనంగా 200 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. 1960 సింధు జలాల ఒప్పందం ప్రకారం రావి నదిపై భారత్కు పూర్తి హక్కులు ఉన్న నేపథ్యంలో, ఇప్పటివరకు వృథాగా పాకిస్థాన్కు వెళ్తున్న నీటిని భారత రైతుల అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: