భారత్ – పాక్ (India-pak) చర్చల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరగాల్సి ఉంది. మధ్నాహ్నం 12 గంటలకు ఇందుకు ముహూర్తంగా ఖరారు చేసారు. ఇదే సమయంలో ప్రధాన మోదీ ఉన్నత స్థాయి సమీక్ష ఏర్పాటు చేసారు. చర్చల వేళ తన వైఖరిని తేల్చి చెప్పారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందనకు అనుగుణంగానే నడుచుకోవాలని త్రివిధ దళాలకు ప్రధాని స్పష్టం చేసారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. దీంతో, చర్చల వేళ తదుపరి పరిణామాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
మోదీ సమీక్షతో ఒత్తిడికి నూతన రూపం
ఇండో, పాక్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ సమావేశం వాయిదా పడింది. ఈ మధ్నాహ్నం 12 గంటలకే జరగాల్సిన భేటీ అనూహ్యంగా వాయిదా వేసారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీ కీలక సమావేశం ఏర్పాటు చేసారు. ఈ భేటీ అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో మోదీ (modi) ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, పాక్ (India-pak) చర్చల నేపథ్యంలో వివిధ అంశాల పై వీరు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఈరోజు రక్షణ ఉన్నతాధికారులతో ప్రధాని నిర్వహించిన రెండో కీలక భేటీ ఇది. ఇలా వరుస భేటీలతో పాక్ పైన ఒత్తిడి పెంచే వ్యూహాలకు మోదీ (modi) పదును పెడుతున్నారు. భారత్ డిమాండ్ల పైన పాక్ స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. పాక్ ను పూర్తిగా ఫిక్స్ చేసే లక్ష్యంతోనే చర్చలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
రెండు దేశాల మిలిటరీ ఆపరేషన్స్ డీజీ ల మధ్య హాట్ లైన్ లో చర్చలు జరుగుతున్నాయి.
48 గంటల కాల్పుల విరమణపై చర్చలు
48 గంటల పాటు కాల్పుల విరమణ, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాగా, ఈ చర్చల సమయంలో భారత్ తమ డిమాండ్స్ ఏంటనేది తేల్చి చెప్పింది. కాల్పుల విరమణ కోసం భారత్ ప్రధానితో అమెరికా వైస్ ప్రెసిడెంట్ వాన్స్ మాట్లాడిన సమయంలోనే కొన్ని అంశాల పైన స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పాక్ లో ఉన్న మసూద్ అజార్ తో పాటుగా టాప్ ఉగ్రవాదులను అప్పగించాలనేది ప్రధాన డిమాండ్ గా ఉంది. అదే సమయంలో పీఓకే ను పాక్ ఖాళీ చేయాల్సిందేనని మోదీ తేల్చి చెప్పినట్లు సమాచారం.
Read Also: BLA Warns: పాక్తో జాగ్రత్తగా ఉండాలని బలోచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరిక