ఇటీవలి కాల్పుల విరమణ ఒప్పందంలో తనదే కీలక పాత్ర అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బలంగా పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంలో అమెరికా పాత్ర ఉందని ఆయన చెప్పడం ఇదే మొదటి సారి కాదు. మళ్లీ ఈ వ్యాఖ్యలు చేసి, అంతర్జాతీయంగా చర్చలకు తావిచ్చారు.ఖతార్లోని అమెరికా సైనిక స్థావరంలో మాట్లాడిన Donald Trump, “ఇరు దేశాల మధ్య సమస్య మరింత తీవ్రమవుతున్న తరుణంలో మేము జోక్యం చేసుకున్నాం.మేము సమయానుసారంగా చర్య తీసుకోకపోతే, క్షిపణుల దాడులు జరిగి ఉండేవి. కానీ మేం అదుపు చేశాం” అన్నారు.ట్రంప్ ప్రకారం, ఆయన భారత్, పాకిస్థాన్లతో వాణిజ్యం గురించి చర్చించి, “యుద్ధం వద్దు, వాణిజ్యం చేద్దాం” అని సూచించారట.ఈ మాటలు విని ఇరు దేశాల నాయకులు కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు.అయితే ఈ వ్యాఖ్యలతో భారత్ మరోసారి అసహనం వ్యక్తం చేసింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు — అమెరికా జోక్యం లేదు, వాణిజ్య ఒప్పందం ఇంకా చర్చల దశలోనే ఉందని చెప్పారు. “మూడు నాలుగు అంశాలు కలసి ఉన్నాయి. వాటన్నిటికీ ఒక నిర్ధారణ అవసరం” అని జైశంకర్ వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు చేయడం ట్రంప్కు కొత్తేమీ కాదు. ఇదే విషయం గతంలోనూ మూడు సార్లు చెప్పారు. ” అణు యుద్ధాన్ని అడ్డుకున్నాను” అనే వ్యాఖ్యలు ఇప్పటికే ఆయన పలుమార్లు చేశారు.
ఆయనకు మద్దతుగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా మాట్లాడారు.అయితే భారత్ మాత్రం ఈ వాదనలను పూర్తిగా తిప్పికొడుతోంది.భారత ప్రభుత్వ ప్రకారం, కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా జోక్యం అనేది అసత్యం. భారత్ మళ్లీ స్పష్టం చేసింది — కశ్మీర్ విషయంలో మూడో పార్టీ అవసరం లేదని. “పాక్ ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేయాలి” అనే డిమాండ్ను భారత్ ఎప్పటికప్పుడు నొక్కిచెబుతోంది.ఈ అంశంపై భారత మాజీ దౌత్యవేత్త కేపీ ఫాబియన్ కూడా స్పందించారు. “అమెరికా భారత్ను కాంటాక్ట్ చేయలేదు. కావాలంటే పాకిస్థాన్ను ఒప్పించి ఉండొచ్చు, కానీ మాకు మధ్యవర్తిత్వం గురించి ఎవరూ చెప్పలేదు” అని ఓ మీడియాకు చెప్పారు.ఇక మే 10న రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పాక్ చొరబాట్లకు ప్రతిగా భారత్ చేసిన దాడుల తర్వాతే ఈ ఒప్పందం జరిగింది. మే 18 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండేలా ఇరు దేశాలు అంగీకరించాయి.
Read Also : Ishaq Dar : ఇషాక్ దార్పై వెల్లువెత్తిన విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు