📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India-pak : భారత్-పాక్ చర్చలు షురూ

Author Icon By Shobha Rani
Updated: May 12, 2025 • 1:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Oparation sindhur) లో భారీ నష్టాలు చవిచూసిన పాకిస్తాన్ అనంతరం అమెరికా అధ్యక్షుడి జోక్యంతో కాల్పుల విరమణకు అంగీకరించింది. అలాగే బారత్ కూడా అమెరికా సూచన మేరకు కాల్పుల విరమణకు సై అంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్స్ మధ్య ఇవాళ కీలక చర్చలకు కూడా అంగీకరించారు. ఈ మేరకు ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు భేటీ అయ్యారు. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్, పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కషిఫ్ చౌదరి మధ్య ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు హాట్ లైన్ లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇందులో వీరిద్దరూ పలు అంశాలపై చర్చలు జరుపుతున్నారు. అయితే కాశ్మీర్ అంశంపై మాత్రం వీరు చర్చించడం లేదు. వీరి భేటీలో చర్చిస్తున్న అంశాల్లో కశ్మీర్లో చొరబాట్లు, సైనిక కార్యకలాపాల నిలిపిపేత, వైమానిక చొరబాట్లు, సరిహద్దు తీవ్రవాదం వంటివి ఉన్నాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ లోకి చొప్పించడం ఆపాలని మన దేశం కోరుతోంది. లాంచ్ ప్యాడ్‌లను మూసివేయడం,డ్రోన్లు చొరబడకుండా చూడటం, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని వదలకుండా ఉండటం, డ్రోన్‌ల ద్వారా మాదకద్రవ్యాలను పంపడం మానేయడం వంటివి భారత్ తరఫున డిమాండ్లుగా ఉన్నాయి. వీటికి పాకిస్తాన్ ఏ మేరకు అంగీకరిస్తుందన్న దానిపైనే తదుపరి చర్చలు లేదా యుద్దం వంటి నిర్ణయాలు ఆధారపడి ఉన్నాయి.

India-pak : భారత్-పాక్ చర్చలు షురూ

డీజీఎంఓ చర్చలు:

హాట్‌లైన్ ద్వారా కీలక మంతనాలు ఆపరేషన్ సిందూర్ (Oparation sindhur) నేపథ్యంలో అమెరికా జోక్యంతో పాకిస్తాన్ డీజీఎంఏ జనరల్ కషీఫ్ చౌదరి భారత డీజీఎంఏ రాజీవ్ ఘాయ్ తో కాల్పుల విరమణకు ప్రతిపాదించారు. దీంతో భారత్ కూడా దీనికి ఒప్పుకుంది. దీంతో రెండు రోజుల క్రితం కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే అదే రోజు పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. దీనిపై భారత్ వెంటనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలో నిన్న పరిస్దితి పూర్తి ప్రశాంతంగా మారింది. దీంతో ఇవాళ ఇరు దేశాల డీజీఎంఏలు చర్చలు జరుపుతున్నారు. భారత తరఫున: మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ ఘాయ్ పాకిస్తాన్ తరఫున: మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ కషీఫ్ చౌదరి.

భారత్ డిమాండ్లు..

ఉగ్రవాదుల చొరబాట్లకు కట్టడి

డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు, డ్రగ్స్ పంపడాన్ని నిలిపివేయాలి

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలను మూసివేయాలి

సరిహద్దుల్లో డ్రోన్ గస్తీ నిరోధించాలి.

Read Also: Oparation sindoor: విక్రమ్ మిస్రీపై అసభ్య ట్రోలింగ్..

Breaking News in Telugu Google news Google News in Telugu India-Pak Latest News in Telugu Paper Telugu News talks begin Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.