📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

INDIA PAKISTAN: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారం

Author Icon By Shobha Rani
Updated: May 16, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌-పాక్‌(India-Pak) ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను కొనసాగించాలని ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (డీజీఎంఓ) స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించనున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగానే వీటిని కొనసాగించాలని భారత్‌, పాక్‌ (India-Pak) సైనికాధికారులు ఇందుకు అంగీకరించినట్లు సమాచారం.
పహల్గాం ఉగ్రదాడి: ఉద్రిక్తతలకు నాంది
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు పాక్​ ప్రయత్నించినప్పటకీ, భారత్​ రక్షణ దళాలు వాటిని తిప్పికొట్టాయి. దీంతో పాక్ ఉద్రిక్తతలు తగ్గించాలని భారత్​ను కోరింది. ఈ అంశంలో సైన్యంలోని డీజీఎంవో స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యాటకులపై కాల్పులు జరిపారు.

INDIA PAKISTAN: భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకారం

డీజీఎంఓల పాత్ర కీలకం
మే 12న ఇరుదేశాల డీజీఎంవోల మధ్య చర్చలు జరిగాయి. అందులో ఇరుపక్షాలు ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు జరపకూడదని, కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు. శత్రుత్వ చర్యలు తీసుకోకూడదనే విషయాలకు కట్టుబడి ఉండాలనే దానిపై చర్చించారు. సరిహద్దులు, ఫార్వర్డ్‌ బేస్‌ ప్రాంతాల్లో బలగాల తగ్గింపును పరిగణించాలని నిర్ణయించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్ మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులు, ఉగ్రదాడుల నివారణకు భారత్ చేసిన కఠిన చర్యల తర్వాత, ఈ కాల్పుల విరమణ సానుకూల సంకేతంగా పరిగణించబడుతోంది. శాంతిని కొనసాగించాలన్న ఉద్దేశంతో ఇరు దేశాలు ఘర్షణకు బదులు గళం మార్గాన్ని ఎంచుకోవడం దౌత్య విజయంగా భావించవచ్చు.

Read Also: TURKEY: తుర్కియేకు భారత్ షాక్

Breaking News in Telugu ceasefire agreed Google news Google News in Telugu India-Pak Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.