📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Telugu News: Zelen Sky: భారత్ మావైపే ఉంది.. ట్రంప్ ఆరోపల్ని ఖండించిన జెలెన్ స్కీ

Author Icon By Pooja
Updated: September 24, 2025 • 3:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అవకాశం దొరికితే చాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై తనదైనశైలిలో విమర్శిస్తుంటారు. రష్యా నుంచి భారత్ అధిక చమురు కొనుగోలు చేస్తున్నదని, దీనివల్లే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నదని ట్రంప్ విమర్శించిన విధానం మనకు తెలిసిందే. అంతేకాక భారత్ రష్యాకు ఆర్థిక సాయం చేస్తున్నదని దీంతో యుద్ధం కొనసాగుతున్నదని ట్రంప్ మరోసారి భారత్ పై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం (Financial assistance) చేస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఖండించారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో జెలెన్ స్కీ మాట్లాడుతూ, ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తమ పక్షానే ఉందని స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్తో సంబంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యమని జెలెన్ స్కీ అభిప్రాయపడ్డారు.

భారత్, చైనాలే నిధులు ఇస్తున్నాయి: ట్రంప్

కానీ ఐక్యరాజ్యసమితి 80వ సెషన్ లో ట్రంప్ ప్రసంగిస్తూ, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనాలే ప్రధాన నిధులు సమకూరుస్తున్నాయని ఆరోపించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, రష్యా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నాయని ట్రంప్ విమర్శించారు. అయితే, జెలెన్ స్కీ ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించారు. ‘భారత్ ఎక్కువగా మా పక్షానే ఉందని నేను భావిస్తున్నాను. రష్యా నుంచి ఇంధన కొనుగోళ్ల విషయంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.

ట్రంప్ వాటిని పరిష్కరించగలరని అనుకుంటున్నాను అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. భారత్ ను పశ్చిమ దేశాల నుండి దూరం చేసుకోకుండా, వారితో బలమైన, సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవాలని యూరోపియన్ దేశాలకు(European countries) కూడా ఆయన సూచించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి భారత్ తన తటస్థ వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. శాంతియుత చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భారత్ పలుమార్లు కోరింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇద్దరితోనూ టెలిఫోన్ లో మాట్లాడి, యుద్ధాన్ని ఆపాలని కోరారు. అంతేకాదు భారత్ ఉక్రెయిన్ కు మానవతా సహాయాన్ని కూడా అందించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్-ఉక్రెయిన్ సంబంధాలు మరింత పటిష్టం అవుతాయని జెలెన్ స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రంప్ భారత్‌పై చేసిన ఆరోపణలు ఏమిటి?
భారత్ రష్యా నుంచి అధిక చమురు కొనుగోలు చేస్తూ, రష్యా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తోందని, దీంతో యుద్ధం కొనసాగుతోందని ట్రంప్ ఆరోపించారు.

జెలెన్ స్కీ ఈ ఆరోపణలకు ఎలా స్పందించారు?
భారత్ ఎక్కువగా ఉక్రెయిన్ పక్షానే ఉందని, సంబంధాలను బలోపేతం చేయడం ముఖ్యమని స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/cinema/zee-5-tamil-horror-thriller-on-zee-5/553496/

Donald Trump India Criticism Google News in Telugu India Ukraine relations Latest News in Telugu Oil Imports India Russia Ukraine War Telugu News Today Zelensky Statement

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.