వర్గల్ (సిద్దిపేట జిల్లా ) India : వ్యవసాయ రంగంలో దేశం (Country) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టగా, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయ పల్లిలో క్రిస్టల్ విత్తనోత్పత్తి సంస్థను పరిశీలించి వివిధ విభాగాలను ప్రారం భించిన సందర్భంగా ఆయన మాట్లాదారు. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆదిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాగా, క్రిమిసం హారక మందుల వినియోగాన్ని తగ్గించి కంపోస్టు ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆధునిక వ్యవసాయ విధానంతో విత్తన ఎంపిక నుండి పంట కోత వరకు ప్రయోజనం, జలాగే నీరు, ఎరువుల వినియోగం సరైన మోతాదులో ఉంటుందన్నారు.. ముఖ్యంగా క్రిమిసంహారక మం దులు అధిక ఎరువుల వినియోగంతో సాగు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని సహజ పద్ద తుల్లో పండించే సాగులో కంపోస్ట్ ఎరువులు వినియోగించి పర్యావరణానికి హాని కలగకుండా ఆరోగ్యకర వంట (Healthy cooking) ఉత్పత్తులు చేసుకోవచ్చని చెప్పారు. అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే నూతన వంగడాలను ప్రోత్సహించి వాతావరణ మార్పులు, తెగుళ్ళ నుండి వంటలు కాపాడుకోవాలని కోరారు.
కేంద్ర వ్యవసాయ, డైరీ రంగాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన నిధులు
కేటాయించడంతో పాటు ఎంఎస్సీ పెంచుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో ప్రయోజనం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వంటల బీమా పథకం వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో నీరు వృథా చేయకుండా భూమిలో చేర్చేందుకు దృష్టి పెట్టాలని, తద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్రమోడిపై ఎంత వత్తిడి వస్తున్నప్పటికీ ఇతర దేశాల పంట ఉత్పత్తుల దిగుబడుల జోలికి వెళ్లకుండా. దేశీయ వ్యవ సాయం, రైతులను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్కు గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతూ అమెరికా వంటి దేశాలకు ధీటైన సమాధానం చెబుతున్నట్లు వివరించారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :