📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

India: వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 3:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత శనివారం తెల్లవారుజామున అమెరికా (America) అకస్మాత్తుగా వెనిజులాపై దాడి చేసి, ఆదేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అదుపులో తీసుకుని, పెను రాజకీయ సంక్షోభానికి తెరతీశారు. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల భారత్ (India) తీవ్ర ఆందోళన చెందుతోందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. అమెరికా, వెనిజులా ప్రభుత్వాలు చర్చించి ప్రజల శ్రేయస్సు, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్య చేపట్టిన ఆనంతరం భారత్ నుంచి వచ్చిన మొదటి ప్రకట ఇదే కావడం గమనార్హం. లక్సెంబర్గ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి అయిన జేవియర్ బెట్టెల్ తో జైశంకర్ సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు, భవిష్యత్ సహకారంపై ఇద్దరు నేతలు మాట్లాడారు. భారత్, లక్సెంబర్గ్ 78 సంవత్స రాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నట్లు జైశంకర్ తెలిపారు. ఐరోపా సమాఖ్యలో లక్సెంబర్గ్ ను కీలక భాగస్వామిగా భారత్ చూస్తుందని అన్నారు. ‘వెనిజులాతో భారత్ కు దశాబ్దాలుగా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ దేశప్రజలు ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి క్షేమంగా బయటపడాలని మేం ఆకాంక్షిస్తున్నాం’ అని జైశంకర్ అన్నారు.

Read also: Floods: ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

ఆచితూచి స్పందించిన భారత్

వెనిజులా పై అమెరికా సైనిక దాడిపట్ల, భారత ప్రభుత్వం (India) చాలా జాగ్రత్తగా, ఆలోచనాత్మకంగా స్పందించిందని వెనిజులా మాజీ భారత రాయబారి వై.కె.సిన్హా అన్నారు. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకొని భారత్ ఈ నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు. రష్యా, చైనా దేశాలు తీవ్రంగా అమెరికా దాడిని ఖండించగా, భారత్ మాత్రం చాలా సంయమనంతో కూడిన ప్రకటన చేసిందని ఆయన అన్నారు. కాగా వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వెనిజులా చమురును అమెరికాకు అప్పగిస్తారని.. దాదాపు 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు స్వాధీనం చేసుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. అంటే దీనినిబట్టి వెనిజులా చమురును అమెరికా తన స్వాధీనంలోకి తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:



india Latest News in Telugu Military intervention Nicolas Maduro S. Jaishankar Telugu News United States Venezuela

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.