ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement – FTA) దక్షిణాసియా రాజకీయల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై తీవ్ర ఆగ్రహాంతో రగిలిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ఆర్థిక సవాల్ గా దీనిని చూస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (EU) మార్కెట్లో ఇప్పటివరకు ఈ రెండు దేశాలు అనుభవిస్తున్న ప్రత్యేక వాణిజ్య ప్రయోజనాలకు భారత్ గట్టి పోటీగా మారింది.
Read Also: India vs pakistan cancelled : భారత్–పాక్ మ్యాచ్ రద్దా? కొలంబో టూరిజం కుదేలే!

ఆందోళనకరంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ల పరిస్థితి
గత దశాబ్దకాలంగా పాకిస్థాన్కు GSP+ (Generalised System of Preferences Plus) హోదా ఉండటంతో.. బంగ్లాదేశ్కు LDC (Least Developed Country) దేశంగా గుర్తింపు ఉండటంతో, ఈ రెండు దేశాలు యూరప్కు తమ వస్త్రాలు, దుస్తులు, లెదర్ ఉత్పత్తులు వంటి వాటిని సుంకాలు లేకుండా (డ్యూటీ ఫ్రీగా) ఎగుమతి చేస్తున్నాయి. అదే సమయంలో భారత్ నుంచి EUకి వెళ్లే వస్తువులపై 10 నుంచి 12 శాతం వరకు సుంకం ఉండేది. దీంతో ధరల పరంగా భారత్ వెనుకబడిన పరిస్థితి కనిపించేది. తాజాగా భారత్-EU FTA ఒప్పందంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోనుంది. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, భారత్కూ యూరోప్ మార్కెట్లో జీరో డ్యూటీ యాక్సెస్ లభిస్తుంది. దీని ఫలితంగా భారతీయ ఉత్పత్తుల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యం, సరఫరా గొలుసు బలంగా ఉన్న భారత్ వైపు యూరోపియన్ దిగుమతిదారులు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడుతోంది. ఇది పాకిస్థాన్, బంగ్లాదేశ్లకు పెద్ద ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా వస్త్ర రంగం (Textiles & Garments)పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: