📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

Author Icon By Vanipushpa
Updated: January 27, 2026 • 4:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్- ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం చరిత్రాత్మక ముందడుగు అని యూరోపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య కీలక ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదిరేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చొరవ చూపారని అన్నారు. ఐరోపా, భారత సహకారం కొత్త శిఖరాలకు చేరుతోందని పేర్కొన్నారు. భారత్‌ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఈ ఒప్పందం భారత్‌- ఐరోపా దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని చెప్పారు. ఐరోపా, భారత బంధం ఈనాటిది కాదని, తమ పూర్వీకులు కూడా గోవాకు చెందిన వారు ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా తన విదేశీ భారతీయ కార్డును చూపించారు.

Read Also: Parliament Updates: ప్రారంభమైన అఖిలపక్ష భేటీ

FTA: భారత్- ఈయూ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం


నా మూలాలు గోవాలో వున్నాయి: ఆంటోనియో కోస్టా

నేను యురోపియన్ కౌన్సిల్​ అధ్యక్షుడిని కావచ్చు. కానీ నేను విదేశీ భారతీయుడిని కూడా. నా మూలాలు గోవాలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. నా తండ్రి కుటుంబం ఇక్కడి నుంచే వచ్చింది. అందుకే భారత్​- ఐరోపా (EU)మధ్య ఉన్న సంబంధం నాకు మరింత ప్రత్యేకం. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్​ది. మన రెండు ఖండాల మధ్య ఎన్నో శతాబ్దాలుగా వ్యాపారం సాగుతోంది. భౌగోళిక రాజకీయ స్థిరత్వానికి, ఆర్థిక వృద్ధికి చాలా ముఖ్యమైనది. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశాల మధ్య ఆర్థిక నియమాలతో పాటు భాగస్వామ్య శ్రేయస్సును ప్రోత్సహిస్తాయి ఆంటోనియో కోస్టా అని అన్నారు.

భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి

దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత ఈ భారీ ఒప్పందం ఒక కొలిక్కి వచ్చింది. 1962లో ఐరోపా ఆర్థిక సముదాయంతో భారత్ సంబంధాలు ప్రారంభించగా, 2004లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. 2007లో మొదలైన FTA చర్చలు అనేక అడ్డంకులను దాటుకుని నేడు ఒక వాస్తవ రూపం దాల్చాయి. ఐరోపా సమాఖ్య ఇప్పటికే భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2024-25లో ఇరుపక్షాల మధ్య సుమారు 13 వేల 600 కోట్ల డాలర్ల వాణిజ్యం జరిగింది. ఈ ఒప్పందంతో భారత్‌కు 45 కోట్ల జనాభా ఉన్న ఐరోపా మార్కెట్ అందుబాటులోకి రానుంది. వస్త్రాలు, తోలు వస్తువులు, ఐటీ సర్వీసులు, ఫార్మా రంగానికి ఈ ఒప్పందం ద్వారా భారీ ఊరట కలగనుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

bilateral trade deal export import growth India EU relations India EU trade agreement India Europe economic ties international trade pact Latest News in Telugu Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.