📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

Bangladesh: భారత్ లోకి హదీ హంతకులు: ధృవీకరించిన బంగ్లా పోలీసులు

Author Icon By Vanipushpa
Updated: December 29, 2025 • 3:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్ లో గత కొన్నిమాసాలుగా నిరసనలు, హింసలతో అతలాకుతలమైపోయింది. భారీగా ప్రభుత్వ ఆస్తులకు భంగం వాటిల్లడమేకాకుండా ప్రశాంత ప్రజాజీవనం లేకుండా పోయింది. నిత్యం రోడ్లుపై నిరసనకారులు ధర్నాలు, నిరసనలు కాస్త హింసాత్మకంగా మారుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన ‘ఇంకిలాబ్ మంచో’ నేత షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులు భారత్ లోకి పారిపోయినట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు (డిఎంపి) అధికారికంగా ధృవీకరించారు. మేఘాలయ సరిహద్దుల గుండా
వారు అక్రమంగా సరిహద్దు దాటినట్లు దర్యాప్తులో తేలింది.

Read Also: Japan: చైనా-తైవాన్ ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. సైన్యం మోహరింపు

Bangladesh

భారత్ ధృవీకరించాలి

ఢాకాలో జరిగిన మీడియా సమావేశంలో అదనపు కమిషనర్ ఎన్. నజ్రుల్ ఇస్లాం మాట్లాడుతూ నిందితులు పైసల్ కరీమ్ మసూద్, ఆలంగీర్ షేక్ మైమెన్సింగ్ లోని వాలువా ఘాట్ సరిహద్దు ద్వారా భారత్ లోకి ప్రవేశించారని తెలిపారు. వీరిద్దరూ సరిహద్దు దాటాక ‘పుర్తి’ అనే వ్యక్తి వారిని రిసీవ్ చేసుకున్నాడని.. ఆ తర్వాత ‘సమీ’ అనే టాక్సీ డ్రైవర్ వారిని మేఘాలయలోని తురా పట్టణానికి తరలించినట్లు సమాచారం అందిందని వివరించారు. ఈ క్రమంలో వీరికి సహకరించిన పుర్తి, సమీలను ఇప్పటికే భారత అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అనధికారిక నివేదికలు అందాయని.. దీనిపై భారత్ నుంచి అధికారిక ధవీకరణ రావాల్సి ఉందన్నారు.

ఉస్మాన్ హదీ ఎవరు?

షరీఫ్ ఉస్మాన్ హదీ కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. గత ఏడాది షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. భారత్, అవామీ లీగ్ ను తీవ్రంగా విమర్శించే హాదీ.. ‘ఇంకిలాబ్ మంచో’ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే డిసెంబర్ 12వ తేదీన ఢాకాలో ముసుగు ధరించిన దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్ లో చికిత్స పొందుతూ డిసెంబరు 18న మరణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bangladesh police confirmation border infiltration cross-border crime Google News in Telugu Hadi killers case India security news national security update Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.