📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

AI Impact Summit: ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

Author Icon By Vanipushpa
Updated: February 16, 2026 • 4:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026(AI Impact Summit) నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, వాటి ప్రభావాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు ఐదు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉద్యోగాల అంతరాయం నుంచి పిల్లల భద్రత వరకు అనేక కీలక అంశాలు ఈ సమ్మిట్ అజెండాలో ఉన్నాయి. ఈ అంతర్జాతీయ AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించనుండగా.. ప్రపంచ AI పాలన, సహకారం కోసం భాగస్వామ్య రోడ్‌మ్యాప్”ను ప్రకటించడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

Read Also: Gold rate today : పసిడి ధర స్థిరం, హైదరాబాద్‌లో తులం ఎంత?

AI Impact Summit: ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్

AI రంగంలో విధానాలు, పెట్టుబడులపై చర్చలు

ఈ ఎక్స్‌పోలో ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థలు, స్టార్టప్‌లు, విద్యా సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు ఒకే వేదికపైకి రానున్నారు. AI రంగంలో తాజా ఆవిష్కరణలు, విధానాలు, పెట్టుబడులపై చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా 13 దేశాలకు చెందిన పెవిలియన్‌లు ఏర్పాటు చేయగా.. ఇవి అంతర్జాతీయ సహకారాన్ని ప్రతిబింబించనున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్‌తో పాటు ఆఫ్రికా దేశాల పెవిలియన్‌లు ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశానికి 30కి పైగా దేశాల నుంచి అంతర్జాతీయ ప్రతినిధులు హాజరుకానున్నారని అంచనా.

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ఒక వేదికగా

ప్రపంచ AI పాలనలో అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతులను బలంగా వినిపించేందుకు ఈ ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ ఒక వేదికగా ఉపయోగపడుతుందని భారత అధికారులు భావిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంలో ఈ స్థాయి గ్లోబల్ AI సమ్మిట్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సమ్మిట్‌లో ముఖ్య వక్తలుగా సుందర్ పిచాయ్, సామ్ ఆల్ట్‌మాన్, డారియో అమోడీ, ముఖేష్ అంబానీ,డెమిస్ హస్సాబిస్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరిగే ఈ అంతర్జాతీయ AI సమ్మిట్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను హై అలర్ట్ చేశారు. భారత్ మండపం పరిసర ప్రాంతాల్లో 10 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

#economic growth Emerging Economy geopolitical strategy Global Diplomacy Global leadership india India's Foreign Policy India's Influence Rising Superpower Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.