ఆసియా కప్ 2025 (2025 Asia Cup) లో భాగంగా ఆదివారం జరిగిన సూపర్–4 పోరులో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) విధ్వంసకర ఇన్నింగ్స్. మ్యాచ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ బౌలర్లు, ఫీల్డర్లు “కారణం లేకుండా మా దగ్గరికి వచ్చి మాటలతో కవ్వించటం నాకు అస్సలు నచ్చలేదు. అలాంటి సందర్భాల్లో నా దృష్టి తప్పకుండా జట్టు కోసం గెలవడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అదే నా ప్రేరణగా మారింది,” అని అభిషేక్ అన్నాడు.
ఈ టోర్నీలో పాకిస్థాన్ను భారత్ ఓడించడం ఇది రెండోసారి. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 74) విధ్వంసకర హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. పాకిస్థాన్ బౌలర్ల (Pakistan bowlers) ను చెడుగుడు ఆడాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.ఈ సందర్భంగా మాట్లాడిన అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఈ రోజు సాధారణంగానే ఉంది.
నేను వారిపై బ్యాట్తో విరుచుకుపడ్డాను
పాకిస్థాన్ ఆటగాళ్లు కారణం లేకుండా మా దగ్గరకు వచ్చి కవ్వింపులకు దిగడం నాకు అస్సలు నచ్చలేదు. దాంతోనే నేను వారిపై బ్యాట్తో విరుచుకుపడ్డాను. జట్టు కోసం గెలవాలనుకున్నాను. శుభ్మన్ గిల్ (Shubman Gill) తో కలిసి స్కూల్ రోజుల నుంచి ఆడుతున్నా. కలిసి ఆడటం ఇద్దరికీ ఇష్టమే. ఈ రోజు జోడీగా మా సత్తా చూపించాలనుకున్నాం.
అనుకున్నట్లుగానే మా నుంచి అద్భుతమైన భాగస్వామ్యం వచ్చింది. శుభ్మన్ గిల్ ఆడిన తీరు నాకు బాగా నచ్చింది. ఎవరైనా ఇలా ఆడుతున్నారంటే అది జట్టు మద్దతు వల్లే సాధ్యమవుతోంది. టీమిండియా మేనేజ్మెంట్ నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడం వల్లే నేను రాణించగలుగుతున్నాను. నేను చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ఒకవేళ అది నా రోజు అయితే.. నా జట్టుకు విజయాన్ని అందిస్తాను.’అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: