📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

IND-AFG: భారత్‌-అఫ్గానిస్థాన్‌ కొత్త స్నేహం

Author Icon By Saritha
Updated: October 10, 2025 • 4:11 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్ పర్యటనలో అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ

అఫ్గానిస్థాన్‌ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ అక్టోబర్ 9 నుంచి 16వ తేదీ వరకు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ను కలవనున్నారు. ఈ సందర్శన అఫ్గాన్‌-భారత్(IND-AFG) సంబంధాల్లో కొత్త దశను సూచిస్తున్నదిగా నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కాబుల్‌లో జరిగిన భారీ పేలుళ్లు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్‌(Pakistan)చీఫ్‌ నూర్ వాలి మెహ్సూద్‌ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ ఫైటర్‌ జెట్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ సంఘటనలు పాక్-అఫ్గాన్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

భారత్ ఇప్పటివరకు తాలిబాన్‌ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోయినా, ఈ పర్యటనతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. తాలిబాన్‌ అధికారంలోకి రాకముందు భారత్‌ అఫ్గాన్‌లోని మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో సుమారు 3 బిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

Read also: బీహార్‌ సీఎంకు ఎదురుదెబ్బ.. ఆర్జేడీలోకి సీనియర్‌ నేతలు జంప్

వాణిజ్య, విద్య మరియు రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలు

ఈ ఒప్పందం ప్రకారం, బ్రిటన్‌లోకి ఎగుమతయ్యే భారతీయ వస్తువులలో దాదాపు 99 శాతం ఉత్పత్తులపై సుంకాలు తగ్గించబడతాయి. దీంతో వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, పాదరక్షలు, ఇంజనీరింగ్ సామాగ్రి వంటి రంగాల్లో భారత ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నారు. అదే విధంగా భారత్‌కు దిగుమతయ్యే బ్రిటిష్(IND-AFG)ఉత్పత్తులలో 90 శాతం పైగా వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. ఇందులో లగ్జరీ కార్లు, విస్కీ, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ఉన్నాయి.

ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య విలువను దాదాపు రెండింతలు పెంచి 120 బిలియన్ డాలర్లకు (రూ.10.66 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. విద్యా రంగంలో భాగంగా బ్రిటన్‌కు చెందిన లాంకాస్టర్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ సర్రే భారత్‌లో క్యాంపస్‌లను స్థాపించడానికి ఆసక్తి చూపాయి. ఈ సంస్థలు గుజరాత్‌లోని సిటీ, కర్ణాటకలోని బెంగళూరులో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

అదనంగా, రక్షణ రంగంలో కూడా ఇరుదేశాల మధ్య సహకారం మరింత బలపడనుంది. రక్షణ పరికరాల తయారీ, సాంకేతికత మార్పిడి విషయంలో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 350 మిలియన్ పౌండ్ల (రూ.4,142 కోట్లు) విలువైన మిసైల్స్‌ మరియు లాంచర్ల సరఫరా ఒప్పందం కూడా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

afghanistan Amir Khan Muttaqi india Jaishankar Pakistan Taliban Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.