Athletes : రోడ్డు ప్రమాదం లో 21 మంది క్రీడాకారుల మృతి

Read Time:  1 min
Athletes : రోడ్డు ప్రమాదం లో 21 మంది క్రీడాకారుల మృతి
FONT SIZE
GET APP

క్రీడా (Sports) విజయాల కోసం బయలుదేరిన క్రీడాకారుల జీవితాలు అర్థంతరంగా ముగిశాయి. నైజీరియాలో (In Nigeria) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరినీ కలచివేసింది. ఓగన్ స్టేట్‌లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో పాల్గొన్న తర్వాత, 35 మంది బస్సులో కనో స్టేట్‌కి తిరిగి బయలుదేరారు.వారిలో క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులూ ఉన్నారు. కానీ వారు తమ గమ్యస్థానాన్ని చేరకముందే ఈ అఘాతం చోటుచేసుకుంది. బ్రిడ్జి వద్ద బస్సు అదుపు తప్పి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.జీవితాన్ని ఆటలకే అంకితం చేసిన 21 మంది క్రీడాకారులు మృత్యువాతపడ్డారు. ఆటలలో రాణించి గుర్తింపు పొందాలన్న ఆశలు అర్ధాంతరంగా ముగిశాయి. ప్రయాణం చివరి దశలోనే ఈ విషాదం జరిగింది.ఈ సంఘటన సౌత్ వెస్ట్ నైజీరియాలోని కురా ప్రాంతంలో జరిగింది. బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. అక్కడే 21 మంది మరణించారు.

ప్రాణాలను నిలబెట్టిన కొందరు

పోలీసులు, ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్టు సమాచారం.ఈ విషాదంపై నైజీరియా మాజీ ఉపాధ్యక్షుడు అటికు అబుబకర్ స్పందించారు. ఈ వార్త విని నా హృదయం ముక్కలైంది, అని తెలిపారు. ఇటువంటి సంఘటనలు జరగకూడదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, అని అన్నారు.

ఆధికారికంగా బాధ్యత స్వీకరణ

కనో స్టేట్ స్పోర్ట్స్ కమిషన్ ఛైర్మన్ ఉమర్ ఫగ్గీ మాట్లాడుతూ, బస్సు అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడింది. అందులో 21 మంది చనిపోయారు. మిగతావారికి వైద్య సేవలు అందిస్తున్నాం, అని తెలిపారు.

వీళ్లకోసం ప్రార్థనలు కొనసాగుతున్నాయి

ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేలాది మంది వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నారు. క్రీడాభిమానులు, సహ క్రీడాకారులు వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

Read Also : Bangladesh Currency : బంగ్లా కొత్త కరెన్సీపై కొత్త చరిత్ర

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.