అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భారత్, పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఘర్షణను తానే ఆపినట్టు పేర్కొన్నారు. ఇది వాణిజ్య ఒత్తిడి వల్ల సాధ్యమైందని వివరించారు.వైట్హౌస్లో కాంగ్రెస్ సభ్యులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్, భారత్–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య యుద్ధాన్ని తానే అడ్డుకున్నానన్నారు. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఆయన దాదాపు 25సార్లు చెప్పారు.

“వారు ఐదు విమానాలు కూల్చేశారు” – ట్రంప్ వివరాలు
ఆ సమయంలో పరిస్థితి భయంకరంగా ఉండింది. ఇరు దేశాలు ఐదు విమానాలు కూల్చేశాయి. పరిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. నేను వారికి ఫోన్ చేసి గట్టిగా హెచ్చరించాను, అని ట్రంప్ తెలిపారు.ట్రంప్ ప్రకారం, ఆయన భారత్, పాక్ ప్రభుత్వాలతో మాట్లాడారు. “ఇలా చేస్తే మీతో వాణిజ్యం ఉండదు” అని ఖచ్చితంగా చెప్పారు. ఈ హెచ్చరిక తర్వాతే ఉద్రిక్తతలు తగ్గినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.
అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం భయానకమే
భారత్, పాకిస్థాన్ రెండూ అణ్వస్త్ర కలిగిన దేశాలు. ట్రంప్ మాటల్లో, ఆ యుద్ధం జరిగి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవి. కానీ నేను మిడిల్లోకి వచ్చి ఆపాను.ఇంకా భారత్ ఈ వాదనను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. అమెరికా జోక్యం ఏమాత్రం లేదని భారత అధికారుల స్పష్టం. పరిస్థితి పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే సద్దుమణిగిందని వాదిస్తున్నారు.
Read Also : Telangana : అవయవదానంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ