Hormuz Strait Oil Crisis: ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ఇప్పుడు అమెరికా మరియు ఇరాన్ మధ్య రణరంగంగా మారింది. ఈ మార్గం గుండా వెళ్లే అమెరికా మరియు దాని మిత్రదేశాల నౌకలను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రమాదకరమైన ‘సీమైన్స్’ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. వేలాది నేవల్ మైన్స్ను సముద్రంలో మోహరించడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యాన్ని స్తంభింపజేయాలని ఇరాన్ చూస్తోంది.
Read Also: FIFA 2026: ఇరాన్ ఆటగాళ్లకు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
వణికిస్తున్న ఇరాన్ ‘సీమైన్స్’ వ్యూహం
నిఘా వర్గాల సమాచారం ప్రకారం, ఇరాన్ ప్రస్తుతం మూడు రకాల అత్యాధునిక మైన్స్ను ఉపయోగిస్తోంది. నౌకలు తాకగానే పేలిపోయే ‘కాంటాక్ట్ మైన్స్’, నౌకల శబ్దం లేదా అయస్కాంత తరంగాల ఆధారంగా పనిచేసే ‘ఇన్ఫ్లూయెన్సర్ మైన్స్’ మరియు సముద్ర గర్భం నుంచి ఒక్కసారిగా పైకి వచ్చే ‘రైజింగ్ మైన్స్’తో సముద్ర మార్గాన్ని ప్రమాదకరంగా మార్చేసింది. ఈ వ్యూహం అమెరికా నౌకాదళానికి పెద్ద సవాలుగా మారింది.

రంగంలోకి దిగిన అమెరికా.. ట్రంప్ హెచ్చరిక
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా వాణిజ్యానికి ఆటంకం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించిన కొద్ది సేపటికే, అమెరికా సైన్యం మెరుపు దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న సుమారు 16 ఇరాన్ యుద్ధ నౌకలను అమెరికా నౌకాదళం ధ్వంసం చేసింది. ఈ దాడితో ఇరాన్ రక్షణ వ్యవస్థకు భారీ విఘాతం కలిగింది.
Hormuz Strait Oil Crisis: ప్రపంచవ్యాప్తంగా చమురు గండం
ప్రపంచానికి అవసరమైన ముడి చమురులో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది. తాజా దాడులు మరియు ఉద్రిక్తతల వల్ల చమురు రవాణా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 200 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, దీనివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ముప్పు ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: