బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలోని స్టార్లింక్ శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులకు భారత్లో ప్రవేశం లభించింది. భారత ప్రభుత్వానికి చెందిన ‘ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్’ (IN-SPACe) ఈ సేవలకు అనుమతి ఇచ్చింది. తద్వారా, స్టార్లింక్ జెన్-1 పేరుతో ప్రారంభం కాబోయే ఈ ప్రాజెక్ట్లో, ఎర్త్ ఆర్భిట్లోని (LEO) శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు.
ఐదేళ్ల పాటు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు
IN-SPACe అందించిన అనుమతుల ప్రకారం, స్టార్లింక్ సంస్థ వచ్చే ఐదేళ్ల పాటు తమ శాటిలైట్ల ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ను భారతదేశంలోని వినియోగదారులకు అందించవచ్చు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, ప్రస్తుతం ఇంటర్నెట్ సేవలు అందక ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ఈ సేవలు గణనీయమైన మార్పు తీసుకురానున్నాయి. ఈ సేవల ద్వారా విద్య, ఆరోగ్యం, కమ్యూనికేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ విప్లవానికి ముహూర్తం
స్టార్లింక్ ప్రాజెక్ట్ ద్వారా భారతదేశంలోని పట్టణాలు మాత్రమే కాక, అంతరించిపోయిన గ్రామాలకు కూడా హైస్పీడ్ ఇంటర్నెట్ అందనుంది. ఈ అవకాశం మౌలిక వసతులు లేని ప్రాంతాలకు నూతన ఆర్ధిక, సాంకేతిక ప్రగతికి దారి తీయనుంది. స్టార్లింక్ సేవలు అందుబాటులోకి రాగానే విద్యార్థులు, రైతులు, చిన్న వ్యాపారాలు వంటి విభాగాలకు మెరుగైన డిజిటల్ కనెక్టివిటీ లభించే అవకాశముంది. దీంతో డిజిటల్ ఇండియా లక్ష్య సాధనకు ఇది పెద్ద పుష్కలంగా మారనుంది.
Read Also : Narendra Modi : నరేంద్రమోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం