📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

USA: భారత నిఘా సంస్థ ‘రా’ పై ఆంక్షలు విధించిన అమెరికా ?

Author Icon By sumalatha chinthakayala
Updated: March 26, 2025 • 3:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

USA: భారత్‌ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ది యూఎస్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలిజియస్‌ ఫ్రీడమ్‌ సంస్థ ‘రా’పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఈ కమిషన్‌ వార్షిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. దీనిలో భారత్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ను ప్రకటించాలని సూచించింది. 2024లో కూడా భారత్‌లో మతపరమైన మైనార్ట్లీలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది.

మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోంది

భారత్‌ ఈ నివేదికపై తక్షణమే స్పందించలేదు. అయితే.. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను, సూచనలను ట్రంప్‌ కార్యవర్గం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన లేదు. వియత్నాంలోని కమ్యూనిస్ట్‌ పాలకులను కూడా ఈ కమిషన్‌ నివేదిక లక్ష్యంగా చేసుకొంది. మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. ఆ దేశాన్ని ఆందోళనకర జాబితాలో చేర్చాలని పేర్కొంది. చైనాను కట్టడి చేసే క్రమంలో అమెరికా పాలకులు భారత్‌, వియత్నాంతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బీజింగ్‌ను కట్టడి చేయడానికి న్యూఢిల్లీ బలమైన శక్తి అని అమెరికా కొన్నేళ్లుగా భావిస్తోంది. ఈనేపథ్యంలో ట్రంప్‌ కార్యవర్గం భారత నిఘా సంస్థ ‘రా’పై ఎటువంటి చర్యలు చేపట్టకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2023లో అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత్‌ లక్ష్యంగా చేసుకొంటోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి వికాస్‌ యాదవ్‌పై అమెరికా ఆరోపణలు మోపింది. ఖలిస్థానీ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు దానిలో పేర్కొంది. మరోవైపు అమెరికాలో ఉంటూనే పన్నూ భారత ప్రభుత్వానికి బెదిరింపు సందేశాలను విడుదల చేస్తుండటం విశేషం.

America Breaking News in Telugu Google news Google News in Telugu india Latest News in Telugu Paper Telugu News RAW Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.