అమెరికా వీసా సంక్షోభం – మైక్రోసాఫ్ట్, జేపీ మోర్గాన్ ఉద్యోగులకు అల్టిమేటం అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ఇమ్మిగ్రేషన్ నిర్ణయం టెక్ రంగాన్ని కలవరపెడుతోంది. ఇకపై H-1B, H-4 (H-1B Visa) వీసాలకు సంవత్సరానికి లక్ష డాలర్ల ఫీజు విధించబడనుంది. దీని ప్రభావం ప్రధానంగా భారతీయులతో పాటు అమెరికాలో పనిచేస్తున్న ఇతర విదేశీ నిపుణులపై పడనుంది. ఈ నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తన H-1B, H-4 (H-1B Visa) వీసా ఉద్యోగులకు గడువుతో కూడిన సూచనలు జారీ చేసింది. అంతర్గత ఇమెయిల్ ప్రకారం, సెప్టెంబర్ 21లోపు అమెరికాకు తిరిగి చేరుకోవాలని కంపెనీ ఆదేశించింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్నవారు అక్కడే ఉండి పనిచేయాలని కూడా సూచించింది.

H-1B Visa
ఇక జేపీ మోర్గాన్ కూడా తన వీసా ఉద్యోగులకు సమానమైన డెడ్లైన్ ఇచ్చింది. రాయిటర్స్ తెలిపిన సమాచారం ప్రకారం, కంపెనీ లీగల్ టీమ్ ఉద్యోగులకు మెయిల్ పంపి – సెప్టెంబర్ 21 ఉదయం 12:01am ET లోపు తప్పనిసరిగా US చేరుకోవాలని హెచ్చరించింది. అదనంగా, అంతర్జాతీయ ప్రయాణాలను తాత్కాలికంగా నివారించాలని సూచించింది. ప్రస్తుతం అమెజాన్, ఆపిల్, గూగుల్, మెటా వంటి టెక్ దిగ్గజాలు వేలాది H-1B వీసాలను కలిగి ఉన్నాయి. కేవలం 2025 ప్రథమార్థంలోనే అమెజాన్ AWS 12,000 వీసాలు, మైక్రోసాఫ్ట్, మెటా ఒక్కొక్కటి 5,000 కంటే ఎక్కువ వీసాలకు ఆమోదం పొందాయి. వీటిలో భారతీయులే 71% వాటా కలిగి ఉండటం గమనార్హం.
1990లో ప్రారంభమైన H-1B వీసా ప్రోగ్రామ్ ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను అమెరికాలో తాత్కాలికంగా నియమించుకోవడానికే రూపుదిద్దుకుంది. సాధారణంగా ఇది మూడు నుంచి ఆరు సంవత్సరాలపాటు చెల్లుబాటు అవుతుంది. కానీ తాజా ఫీజు పెంపు కారణంగా, భారతీయ IT ఉద్యోగులు పెద్ద ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మైక్రోసాఫ్ట్, (Microsoft) జేపీ మోర్గాన్ తక్షణ చర్యలు సూచించడంతో, భారతీయ టెక్ నిపుణులు తమ భవిష్యత్తును భద్రపరచుకోవడానికి అత్యవసర నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అమెరికా తీసుకున్న కొత్త నిర్ణయం ఏమిటి?
H-1B, H-4 వీసాలపై సంవత్సరానికి లక్ష డాలర్ల ఫీజు విధించడం.
ఈ ఫీజు పెంపు వల్ల ఎవరు ఎక్కువగా ప్రభావితమవుతారు?
అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు, ముఖ్యంగా IT రంగ నిపుణులు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: