2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని అమెరికాకు చెందిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలు — జాన్ మార్టినిస్, John Martinis మైఖేల్ డేవొరే, జాన్ క్లార్క్ — గెలుచుకున్నారు. క్వాంటం మెకానిక్స్ రంగంలో వీరు చేసిన వినూత్న పరిశోధనలకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 1980 దశకంలో ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు సూపర్ కండక్టర్ల ఆధారంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ సర్క్యూట్లలో క్వాంటం ఎనర్జీ స్థాయిలు, టన్నెలింగ్ ప్రక్రియలను గుర్తించడం ద్వారా భౌతికశాస్త్రంలో కొత్త మార్గాలను చూపించారు. ఈ పరిశోధనలే నేటి క్వాంటం కంప్యూటింగ్ అభివృద్ధికి పునాదిగా నిలిచాయి.
California: దీపావళికి హాలిడే ప్రకటించిన కాలిఫోర్నియా

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభినందనలు
ఈ విజేతల్లో ఇద్దరు గూగుల్ క్వాంటం ఏఐ ల్యాబ్తో అనుబంధమున్నారని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. “మైఖేల్ డేవొరే మా క్వాంటం ఏఐ ల్యాబ్లో చీఫ్ సైంటిస్ట్గా, జాన్ మార్టినిస్ పలు సంవత్సరాలు హార్డ్వేర్ టీమ్కి నాయకత్వం వహించారు. వారి కృషి గూగుల్కే కాదు, శాస్త్ర ప్రపంచానికీ గర్వకారణం” అని పిచాయ్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. తాజాగా గూగుల్ శాంటా బార్బరా క్వాంటం ల్యాబ్ను సందర్శించిన పిచాయ్, Pichai “అక్కడ జరుగుతున్న పురోగతిని చూసి మిక్కిలి ఆనందించాను. గూగుల్తో అనుబంధం ఉన్న ఐదుగురు నోబెల్ గ్రహీతలు ఉండటం మాకు గర్వకారణం” అని అన్నారు.
శాస్త్రవేత్తల ప్రస్థానం
- మైఖేల్ డేవొరే — ప్రస్తుతం గూగుల్ క్వాంటం ఏఐ ల్యాబ్లో చీఫ్ సైంటిస్ట్గా, యేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
- జాన్ మార్టినిస్ — 2020లో గూగుల్ నుండి వైదొలగి, 2022లో స్వంతంగా క్వాంటం కంప్యూటింగ్ స్టార్టప్ స్థాపించారు.
- జాన్ క్లార్క్ — క్వాంటం సర్క్యూట్లలో ఎనర్జీ స్థాయుల పరిశీలనలో కీలక పాత్ర పోషించారు.
2025 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి ఎవరికీ లభించింది?
జాన్ మార్టినిస్, మైఖేల్ డేవొరే, జాన్ క్లార్క్ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు 2025 భౌతిక శాస్త్ర నోబెల్ బహుమతి లభించింది.
ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు ఏ రంగంలో కీలక పరిశోధనలు చేశారు?
వీరు క్వాంటం మెకానిక్స్ రంగంలో కీలక ఆవిష్కరణలు చేశారు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ సర్క్యూట్లలో క్వాంటం టన్నెలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్పై పరిశోధనలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
EPaper: https://epaper.vaartha.com/
Read Also: