📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: Georgia – జార్జియా దేశంలోకి భారతీయుల్ని అనుమతించని అధికారులు

Author Icon By Rajitha
Updated: September 17, 2025 • 12:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జార్జియా (Georgia) సరిహద్దులో భారతీయుల అవమానం – 56 మందికి నిరాకరణ జార్జియాలో భారతీయ పర్యాటకులు ఘోర అవమానానికి గురయ్యారు. సరైన పాస్‌పోర్టులు, ఈ-వీసాలు ఉన్నప్పటికీ 56 మంది భారతీయుల బృందాన్ని ఆర్మేనియా నుంచి జార్జియాలో (Georgia) కి ప్రవేశించనీయకుండా సరిహద్దు అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

బాధితుల అనుభవం:
ధృవీ పటేల్ (Dhruv Patel) అనే మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. సదఖ్లో సరిహద్దులో ఐదు గంటలకు పైగా గడ్డకట్టే చలిలో ఆరుబయట నిలబెట్టారని, ఆ సమయంలో కనీస ఆహారం లేదా టాయిలెట్ సౌకర్యం కూడా ఇవ్వలేదని తెలిపారు. పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని, పశువుల్లా ఫుట్‌పాత్‌పై కూర్చోబెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అమానుష ప్రవర్తన:
అధికారులు వారిని నేరస్థుల్లా వీడియోలు తీయగా, వారు వీడియోలు తీయకుండా అడ్డుకున్నారని తెలిపారు. పత్రాలను సరిగా తనిఖీ చేయకుండానే వీసాలు సరైనవి కావని చెప్పి వెనక్కి పంపించారని ధృవీ పటేల్ ఆరోపించారు.

Georgia

భారత ప్రభుత్వంపై విజ్ఞప్తి:

జార్జియా భారతీయుల పట్ల ఇలాగే ప్రవర్తించడం అవమానకరం. భారత ప్రభుత్వం వెంటనే స్పందించాలి” అంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, (Prime Minister Narendra Modi) విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ (Jaishankar) లను ట్యాగ్ చేశారు.

సోషల్ మీడియాలో చర్చ:
ఈ ఘటనపై పోస్ట్ వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. గతంలో కూడా జార్జియాలో ఇలాంటి అనుభవాలే ఎదురైందని పలువురు తెలిపారు. “భారతీయులపై వివక్ష చాలా కాలంగా కొనసాగుతోంది” అంటూ కొందరు నెటిజన్లు స్పందించగా, ఇది జాతి వివక్షలో భాగమేనని మరికొందరు వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు:
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, ఈ సంఘటనతో భారతీయుల భద్రత, గౌరవం పై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

జార్జియాలో ఎంతమంది భారతీయులు అవమానానికి గురయ్యారు?
మొత్తం 56 మంది భారతీయ పర్యాటకులను జార్జియా సరిహద్దు వద్ద ఆపేశారు.

వారికి సరైన వీసాలు, పత్రాలు ఉన్నాయా?
అవును, సరైన పాస్‌పోర్టులు మరియు ఈ-వీసాలు ఉన్నప్పటికీ వారిని దేశంలోకి అనుమతించలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/neeraj-chopra-where-to-watch-neeraj-chopras-match-at-the-world-athletics-championships-today/international/548823/

armenia Breaking News dhruvi patel georgia border humiliation immigration problems Indian indian tourists latest news Telugu News visa issues

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.