విదేశాల్లో ఉద్యోగం చేసి భారత్కు తిరిగి వచ్చిన వారు (NRIs), అలాగే అక్కడ చదువుకుని వెనక్కి వచ్చిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే వార్త చెప్పింది. విదేశాల్లో ఉన్నప్పుడు పొందిన ESOP (ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్), అక్కడ వాడకుండా వదిలేసిన బ్యాంకు ఖాతాలు లేదా ఇన్సూరెన్స్ పాలసీల వివరాలను ఇండియాలో ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు వెల్లడించని వారికి ఉపశమనం కలిగించేలా ‘FAST-DS 2026’ స్కీమ్ను బడ్జెట్లో ప్రతిపాదించింది. చాలామంది భారతీయులు విదేశాల్లో పని చేస్తున్నప్పుడు కంపెనీల నుంచి ESOP(ESOP) లేదా RSUs పొందుతుంటారు. ఇండియాకు తిరిగి వచ్చాక.. వీటి వివరాలను ఆదాయపు పన్ను ఫారమ్లో చూపించడం మర్చిపోతుంటారు. అలాగే విద్యార్థులు అక్కడ చిన్నపాటి బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయకుండా వదిలేస్తుంటారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పన్ను ఎగవేత కాదని, కేవలం అవగాహన లేక చేసిన పొరపాటని ప్రభుత్వం గుర్తించింది.
Read Also: America: బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

ప్రభుత్వం మరో కీలక మార్పు
నిర్ణీత ట్యాక్స్ లేదా ఫీజు చెల్లించి, పెనాల్టీలు, జైలు శిక్ష నుంచి తప్పించుకోవచ్చు. కాల పరిమితి: ఇది నిర్ణీత కాలం పాటు మాత్రమే అందుబాటులో ఉండే స్కీమ్. ప్రభుత్వం మరో కీలక మార్పును ప్రతిపాదించింది. స్థిరాస్తులు కాకుండా ఇతర విదేశీ ఆస్తుల విలువ రూ. 20 లక్షల లోపు ఉంటే, వాటి వెల్లడిలో జరిగిన చిన్నపాటి లోపాలకు ఇకపై కఠిన శిక్షలు వర్తించవు.
ఉద్యోగులకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం
ప్రస్తుతం ఆటోమేటిక్ ఎక్స్ ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ (AEOI) ద్వారా విదేశాల్లో భారతీయులకు ఉన్న ఆస్తుల సమాచారం భారత ప్రభుత్వానికి సులభంగా తెలిసిపోతోంది. అందుకే నోటీసులు రాకముందే ఈ ‘ఫాస్ట్-డీఎస్ 2026’ ద్వారా మీ వద్ద ఉన్న ESOP లేదా ఇతర ఆస్తులను డిక్లేర్ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నేరపూరిత కార్యకలాపాల ద్వారా సంపాదించిన ఆస్తులకు ఈ స్కీమ్ వర్తించదని గుర్తుంచుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ FAST-DS 2026 స్కీమ్ విదేశాల్లో పనిచేసి వచ్చిన మధ్య తరగతి ఉద్యోగులకు, విద్యార్థులకు ఒక అద్భుతమైన అవకాశం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: