కొత్త ఏడాదిలోకి వచ్చామనే సంతోషం ఇండోనేషియా (Indonesia) ప్రజలకు లేదు. సరిగ్గా నూతన సంవత్సరంలోకి వచ్చి వారం రోజులే అవుతున్నది. ఇది రెండోసారి అధిక వర్షాలతో ఆ దేశం కుండపోత వర్షాలతో అతలాకుతలమవుతున్నది. నాలుగురోజుల క్రితమే ఆకస్మిక వర్షాలతో ఇండోనేషియాను వరదలు ముంచెత్తాయి. పలు ఇళ్లు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. ఆ నష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలతో ఆదేశ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.
Read also: America: వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

Torrential rain in Indonesia
తాజాగా ఇండోనేషియాలోని ఉత్తర సులవేసి ప్రావిన్సులో కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ ఘటనలో 16మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వరదల ప్రభావానికి సోమవారం తెల్లవారుజామున నదులు ఉప్పొంగాయి. సియావు తగులాండాంగ్ బీయారో జిల్లాలో బురద, రాళ్లు, శిథిలాలతో కూడిన వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించింది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు.
దెబ్బతిన్న 140 పైగా ఇళ్లు
ఈ వరదల ధాటికి 140కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. 680 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. రోడ్లు, సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. బాధితులకు వేగంగా సాయం అందించేందుకు సితారో జిల్లాలో సోమవారం నుంచి 14రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. అత్యవసరం అయితేనే తప్ప ఇండ్లనుంచి బయటకు రావద్దని ప్రభుత్వం ప్రజలను హెచ్చరిస్తున్నది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: